వాహన దొంగల ముఠా అరెస్ట్ | Vehicle thieves gang arrested | Sakshi
Sakshi News home page

వాహన దొంగల ముఠా అరెస్ట్

Aug 25 2015 3:52 PM | Updated on Aug 20 2018 4:27 PM

వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాకు చెందిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

హిందూపురం (అనంతపురం) : వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాకు చెందిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 5.50 లక్షల విలువ చేసే 3 ఆటోలు, 2 ద్విచక్రవాహనాలు, 4 ఆవులు, 2 మేకలు స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా చోరీలు చేస్తూ జీవనం సాగిస్తున్న నలుగురు యువకుల ముఠాకు గంగాధర్ నాయకత్వం వహిస్తున్నాడు.

వీరు పట్టణ పరిధిలోనే కాకుండా పలు పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డారు. కాగా సోమవారం వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరి నుంచి రూ. 5.50 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకొని వీరిని రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement