ఉచిత విద్యుత్ కల సాకారం | up to 50 units free power facility | Sakshi
Sakshi News home page

ఉచిత విద్యుత్ కల సాకారం

Nov 19 2013 4:18 AM | Updated on Sep 15 2018 2:43 PM

ఉప ప్రణాళిక పుణ్యమాని షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీ)లకు ఉచిత విద్యుత్ సదుపాయం అందుబాటులోకి రానుంది. 50 లోపు యునిట్లు వినియోగించుకున్న వారికి విద్యుత్ చార్జీల మినహాయింపును ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.

 ఉట్నూర్, న్యూస్‌లైన్ :
 ఉప ప్రణాళిక పుణ్యమాని షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీ)లకు ఉచిత విద్యుత్ సదుపాయం అందుబాటులోకి రానుంది. 50 లోపు యునిట్లు వినియోగించుకున్న వారికి విద్యుత్ చార్జీల మినహాయింపును ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో విద్యుత్ వినియోగంపై వివరాలపై పరిశీల న కూడా చేస్తున్నారు. రచ్చబండ నిర్వహణ దృష్ట్యా అధికారులు కొన్ని నివాసాలు గుర్తించినప్పటికీ పూర్తి క్షేత్రస్థాయి పరిశీలన సిద్ధం అవుతున్నారు. ఈ బాధ్యతలు సాంఘిక సంక్షేమ శాఖకు అప్పగించారు. ఎస్టీల్లోని అర్హులను గుర్తించడం పనులు ఏజెన్సీ అధికారులు చేపడుతున్నారు. వీటిని ఆన్‌లైన్ ద్వారా నిర్వహించనున్నారు. త్వరలోనే ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలో నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది.
 
 0 నుంచి 50 యూనిట్లు వినియోగించే వారికే..
 0 నుంచి 50 యూనిట్ల విద్యుత్ వినియోగించే ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే ఉచిత సదుపాయాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 50 యూనిట్లు దాటి బిల్లు వచ్చే వారికి ఈ విధానం వర్తించదు. దీని ద్వారా విద్యుత్ పొదుపునకు కూడా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు అలవాటు పడుతాయని ప్రభుత్వం భావిస్తుంది. గ్రామాల్లోని ఎస్సీ కాలనీల్లో నివసించే వారికి మాత్రమే ఈ ఉచిత సౌకర్యాన్ని అమలు చేయనున్నారు. అలాగే ఎస్టీ ప్రాంతాల్లో ఉచిత విద్యుత్‌కు చర్యలు తీసుకోవడం ద్వారా అర్హులైన కుటుంబాలు ప్రయోజనం పొందనున్నాయి.
 
 ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వర్తింపు
 జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 50 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని అర్హులైన లబ్ధిదారులు అందించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. వీటి ప్రకారం గత సెప్టెంబర్ నుంచి అంటే మొత్తం ఆరు నెలలకు సంబంధించిన 50 యూనిట్లలోపు వినియోగించిన ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు వారు చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఆన్‌లైన్ ద్వారా చెల్లించడమా? లేక ఏదైనా ప్రత్యామ్నాయం ఆలోచించడమా అనేది ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్నాట్లు తెలిసింది. ప్రభుత్వం మూడో విడుత నిర్వహిస్తూన్న రచ్చబండ సందర్భంగా అధికారులు జిల్లాలో యాభై యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకుంటుంన్నా   దాదాపు 20,260 ఎస్సీ కుటుంబాలు, సుమారు 17,734 ఎస్టీ కుటుంబాలను గుర్తించారు. వీరందరికి ప్రభుత్వం దాదాపు రూ. 18.20 కోట్ల బిల్లులు మాఫీ చెయ్యనుంది. అయా శాఖల అధికారులు పూర్తి స్థాయిలో నివేదికలు సకాలంలో ప్రభుత్వానికి సమర్పిస్తే అర్హులైన కుటుంబాలు ఇక విద్యుత్ బిల్లులు చేల్లించాల్సిన అవసరం లేకుండా పోతుంది.
 
 అయా శాఖలకే బాధ్యతలు
 ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సాంఘిక సంక్షేమశాఖ, ఏజెన్సీ ప్రాంతాల అధికారులకు అప్పగించింది. అధికారులు విద్యుత్‌శాఖ అధికారుల నుంచి 50 యూనిట్లు వినియోగిస్తున్న ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన డిమాండ్ నోటీసులు తీసుకుని వాటి ఆధారంగా గ్రామాల్లో సర్వే నిర్వహించనున్నారు. వసతి గృహాల సంక్షేమాధికారులు, సహాయ సంక్షేమ అధికారులు త్వరలో రెండమ్ చెక్ పేరిట అయా ప్రాంతాల్లో జాబితాల్లో వివరాలు పరిశీలించి తగు నివేదికలు తయారు చేసి ఉన్నతాధికారులకు సమర్పించనున్నారు. అంత సక్రమంగా పూర్తయితే త్వరలోనే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద నిధులు విడుదలకు బడ్జెట్‌ను విడుదల చేసి 50 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలును ప్రభుత్వం చేపట్టనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement