గోడకూలి ఇద్దరు తాపీ మేస్త్రీలు మృతి | two people died in s.kota | Sakshi
Sakshi News home page

గోడకూలి ఇద్దరు తాపీ మేస్త్రీలు మృతి

Mar 13 2017 4:32 PM | Updated on Aug 25 2018 6:06 PM

నిర్మాణం లో ఉన్న గోడ కూలి ఇద్దరు తాపీ మేస్త్రీలు మృత్యువాత పడ్డారు.

ఎస్‌.కోట(విజయనగరం):  నిర్మాణం లో ఉన్న గోడ కూలి  ఇద్దరు తాపీ మేస్త్రీలు  మృత్యువాత పడ్డారు. విజయనగరం జిల్లా ఎస్‌.కోట మండలం సీతంపేటకు చెందిన పూడి ఈశ్వరరావు(26), నాగభూషణం(25) తాపీ మేస్త్రీలు.

సోమవారం పోతనాపల్లిలో గ్రామంలో ఓ ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా గోడ నిర్మిస్తున్నారు. అయితే, గోడ పటిష్టం కాకపోవటంతో నిర్మిస్తుండగానే కూలింది. ఇటుకలు మీద పడటంతో తాపీ మేస్త్రీలు అక్కడికక్కడే మృతిచెందారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement