ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండటంతో వడదెబ్బ బారిన పడి మృతిచెందినవారి సంఖ్య ఎక్కువవుతోంది.
కమలాపురం (వైఎస్సార్ జిల్లా) : ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండటంతో వడదెబ్బ బారిన పడి మృతిచెందినవారి సంఖ్య ఎక్కువవుతోంది. సోమవారం వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం మండలంలోని ఎర్రగుడిపాడు గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి(45) వ్యవసాయ పనులు చేస్తుండగా సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రికి తరలించడానికి యత్నిస్తుండగా అంతలోనే మృతిచెందాడు. మండలంలోని గంగవరం గ్రామానికి చెందిన కె. పెద్దలక్ష్మమ్మ(60) వడదెబ్బకు గరై మృతిచెందింది.