విజయనగరం జిల్లాలో డెంకాడ మండలంలోని దొడ్డిబాడువ గ్రామంలో గురువారం వినాయకుని నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది.
విజయనగరం జిల్లాలో డెంకాడ మండలంలోని దొడ్డిబాడువ గ్రామంలో గురువారం వినాయకుని నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. ఆ గ్రామ సమీపంలోని చంపావతి నదిలో వినాయకుని ప్రతిమను నిమజ్జనం చేస్తూ ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు నదిలో పడి పోయారు.
దాంతో వారిని రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించారు. అయితే నదిలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉంది. ఈ నేపథ్యంలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు గల్లంతైన వారిని రక్షించేందుకు చర్యలకు ఉపక్రమించారు.