సర్కారు పథకాలు వారికే అందాలి. సబ్సిడీలు వారికే మంజూరు కావాలి. పదవులు... ఉద్యోగాలు... చివరకు గ్రామాల్లో అధికారం మొత్తం ఆ పార్టీని నమ్ముకున్నవారికే అందివ్వాలి. అదే లక్ష్యంతో ప్రస్తుత పాలకులు ముందుకు సాగుతున్నారు. నిజమైన అర్హులున్నా... తమకు విధేయులు కాకుంటే వారికి రిక్తహస్తమే. తాజాగా రైతు రథం రాయితీపై ట్రాక్టర్ల సరఫరా పథకం లోనూ ఈ విధానమే కొనసాగుతోంది. దీనికి దరఖాస్తు దశనుంచే కుట్రలు మొదలయ్యాయన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
బలిజిపేట రూరల్(పార్వతీపురం): రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన రైతు రథం–రాయితీపై ట్రాక్టర్ల సరఫరా పథకాన్ని తెలుగు తమ్ముళ్ళకే వర్తింపజేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం పక్కాగా వ్యూహం రచించి... ఆ మేరకు మంజూరు చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దరఖాస్తుల పర్వం నుంచే అక్రమాలకు తెరతీశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వ్యవసాయ యాంత్రీకరణలో బాగంగా రైతు రథం – 2017 పథకం కింద జిల్లాకు 320 ట్రాక్టర్లు రాయితీపై మంజూరు చేయాలని నిర్ణయించారు. గ్రామీణ నియోజకవర్గాలకు వీటిని కేటాయించాలని నిర్దేశించారు. జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో విజయనగరంలో ఒక మండలం, మిగిలిన 8 నియోజకవర్గాల కు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నారు. విజయనగరం నియోజకవర్గంలోని మండలానికి 8 ట్రాక్టర్లు, మిగిలిన 312 ట్రాక్టర్లు 8 నియోజకవర్గాలకు సమానంగా... ఒక్కో నియోజకవర్గానికి 39 ట్రాక్టర్లు వంతున కేటాయించారు.
ఇవీ నిబంధనలు
ఈ పథకానికి కొన్ని నిబంధనలు రూపొందిం చారు. ముఖ్యంగా ఇంతకు ముందు ఏ పథకంలో కూడా రైతు రాయితీ ట్రాక్టరు పొంది ఉండకూడదు. రైతుకు కనీసం 2 ఎకరాల పొలం ఉండాలి. రైతుకు సొంతంగా ట్రాక్టరు ఉండరాదు. ఏ రకం ట్రాక్టరు కొనాలో రైతే నిర్ణయం తీసుకోవాలి. మంజూరయిన ట్రాక్టర్లలో ఎస్సీ, ఎస్టీ కులాలకు తగినవిధంగా కేటాయింపులు చేయాలి. అర్హులైన రైతులు నేరుగా వ్యవసాయశాఖ నుంచి దరఖాస్తు తీసుకుని దీనికి సంబంధించిన డాక్యుమెం ట్లను జతచేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. రైతులు చేసుకున్న దరఖాస్తులను వ్యవసాయశాఖ ఉన్నతాధికారుల ద్వారా జిల్లా ఇన్చార్జ్ మంత్రికి చేరుతాయి. వారి ఆదేశాలమేరకు యూనిట్లు మంజూరవుతాయి.
జిల్లాలో జరుగుతున్న తీరిదీ...
పార్వతీపురం నియోజకవర్గానికి 39 మంజూరవగా బలిజిపేట మండలానికి సుమారు 12 నుంచి 14వరకు మంజూరుకావచ్చని భావిస్తున్నారు. వీటికి సంబంధించి తెలుగు తమ్ముళ్ళ దరఖాస్తులు వేరేలా, సాధారణ రైతు దరఖాస్తు వేరేగా ఉండడంతో అవకతవకలకు మార్గం సుగమం అయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సబ్సిడీ ట్రాక్టరు కావాలంటే తెలుగు తమ్ముళ్ళ దరఖాస్తు చేసుకుంటేనే వస్తుందని... లేకపోతే రథంవైపు చూడాల్సిన అవసరం లేదనే భావనలు వినిపించడంతో రైతులు నీరుగారారు.
తెలుగు తమ్ముళ్ళ దరఖాస్తులో స్థానిక ఎమ్మెల్యే సూచనలకు, సంతకాలకు లోబడి ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దరఖాస్తులో ‘నా యొక్క దరఖాస్తు గ్రామ, మండల జన్మభూమి కమిటీ, పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యే ద్వారా వ్యవసాయ శాఖకు సమర్పించుట గురించి’ అని ఉండడం, దరఖాస్తు చివరన ఎమ్మెల్యే సంతకానికి కాలమ్ ఏర్పాటు చేశారు.
అంటే ఎమ్మెల్యే సిఫార్సు చేసిన వారికి మాత్రమే రథాలు వస్తాయని వేరే చెప్పనవసరం లేదు. సిఫార్సులు లేనివారు తమ దరఖాస్తులను సాదా సీదాగా వ్యవసాయశాఖ కార్యాలయానికి అందజేశారు. రైతు రథం పథకానికి మండలంలో ఇప్పటికి 20మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. దీనిలో 14మంది తెలుగు తమ్ముళ్ళు ఉన్నట్టు సమాచారం. అంటే వారికే ట్రాక్టర్లు మంజూరవుతాయన్నది జగమెరిగిన సత్యం.
ఎమ్మెల్యే సిఫార్సులుంటాయనే వస్తాయని...
రైతురథం పథకంలో సబ్సిడీ ట్రాక్టరు పొందేందుకు ఎమ్మెల్యే సిఫార్సు చేసిన దరఖాస్తు ఉంటేనే వచ్చే అవకాశాలున్నాయని విశ్వయనీయంగా తెలియ డం, ఎమ్మెల్యే సూచనల మేర తెలుగు తమ్ముళ్లు అక్కడి నుంచి ప్రత్యేక దరఖాస్తులు తెచ్చుకుని ఆన్లైన్ చేయడం చూసి నేను దరఖాస్తు చేయడం మానుకున్నాను. పక్కాగా తెలుగు తమ్ముళ్ళకే వస్తాయని తెలిసిన తరువాత చేయడం ఎందుకని మానేశాను.
– ప్రసాద్, సర్పంచ్, నారాయణపురం.
ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు:
ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని పరిశీలించి అనర్హులను తొలగించి అర్హులైనవాటిని జిల్లా యంత్రాంగానికి అందిస్తాం. అక్కడి నుంచి ఇన్చార్జ్ మంత్రికి సమర్పిస్తాం. పథకంలో లబ్ధి పొందేది ఎవరో అప్పుడు తెలుస్తుంది.
– భానులత, ఏడీ,
వ్యవసాయ శాఖ, బొబ్బిలి
‘రథ’సారథ్యం తమ్ముళ్లకే!
Published Wed, Aug 9 2017 3:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement