ఈనాటి ముఖ్యాంశాలు

Today Telugu News Nov2nd Mp Bandi Sanjay Fires on Kcr - Sakshi

టీడీపీకి అనుబంధ పార్టీగా జనసేన వ్యవహరిస్తోందని జల వనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై తెలుగుదేశం నాయకులు చేస్తున్న ఆరోపణలు అవివేకమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య మండిపడ్డారు. ఆర్టీసీ సమ్మెను రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని ఆ‍ర్టీసీ జేఏసీ కన్వీనర్‌ ఆశ్వత్థామరెడ్డి ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుడు చనిపోతే శవరాజకీయం అంటున్న వారు ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం 1200 మంది ప్రాణత్యాగం చేస్తే మీరు చేసింది ఏమిటో చెప్పాలంటూ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ ధ్వజమెత్తారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శనివారం థాయ్‌లాండ్‌ చేరుకున్నారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియోను క్లిక్‌ చేయండి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top