ఈనాటి ముఖ్యాంశాలు

Today News Round Up 12th March Covid 19 Say No to Panic Say Yes To Precautions PM Modi Tweets - Sakshi

కరోనా వైరస్‌ విజృంభణతో స్టాక్‌మార్కెట్లో గురువారం మహాపతనం నమోదైంది. బ్లాక్‌మండే షాక్‌ నుంచి తేరుకోని మార్కెట్లపై మరోసారి బేర్‌ పట్టుబిగించింది. అంతర్జాతీయ మహమ్మారిగా కరోనా వైరస్‌ను అధికారికంగా డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించడంతో స్టాక్‌మార్కెట్లు కుప్పకూలాయి. మరోవైపు తాను ముఖ్యమంత్రి పదవి కోసం రాజకీయాల్లోకి రావటం లేదని, కేవలం మార్పుకోసం వస్తున్నానని సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. . విశాఖలో నిర్వహించిన వేడుకల్లో వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొని పార్టీ జెండాను ఎగురవేశారు. గురువారం చోటు చేసుకున్న మరిన్నివార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top