వాహనం బోల్తా: పోలీసులకు తీవ్ర గాయాలు | Three police injured in vehicle overturns at Nawabpet in krishna district | Sakshi
Sakshi News home page

వాహనం బోల్తా: పోలీసులకు తీవ్ర గాయాలు

Mar 21 2014 10:38 AM | Updated on Sep 2 2017 5:00 AM

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబు పేట సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం పోలీసులతో వెళ్తున్న వాహనం బోల్తా పడింది.

కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబు పేట సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం పోలీసులతో వెళ్తున్న వాహనం బోల్తా పడింది. ఆ ఘటనలో ముగ్గురు పోలీసులకు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి, సమీపంలోని పోలీసులకు సమాచారం అందించారు.

 

స్థానిక పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన పోలీసులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే పోలీసులకు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉందని, వారిని విజయవాడ తరలించాలని సదరు వైద్యులు పోలీసులకు సూచించారు. దాంతో క్షతగాత్రులను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement