breaking news
vehicle overturns
-
వాహనం బోల్తా: 15మందికి గాయాలు
బిజినేపల్లి (మహబూబ్నగర్ జిల్లా) : బిజినేపల్లి మండలం వట్టెం వద్ద ప్రమాదవశాత్తూ క్రూజర్ వాహనం బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. లోకేష్, ఐశ్వర్య, సిద్ధార్థ అనే చిన్నారులతో పాటు మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ నుంచి కొల్లాపూర్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. టైరు పంక్చర్ అవ్వడం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. వీళ్లంతా కోడేరు మండలకేంద్రానికి చెందినవారుగా గుర్తించారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
వాహనం బోల్తా: పోలీసులకు తీవ్ర గాయాలు
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబు పేట సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం పోలీసులతో వెళ్తున్న వాహనం బోల్తా పడింది. ఆ ఘటనలో ముగ్గురు పోలీసులకు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి, సమీపంలోని పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన పోలీసులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే పోలీసులకు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉందని, వారిని విజయవాడ తరలించాలని సదరు వైద్యులు పోలీసులకు సూచించారు. దాంతో క్షతగాత్రులను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.