వాహనం బోల్తా: 15మందికి గాయాలు | 15 injured as vehicle overturns | Sakshi
Sakshi News home page

వాహనం బోల్తా: 15మందికి గాయాలు

Apr 8 2016 3:18 PM | Updated on Sep 3 2017 9:29 PM

బిజినేపల్లి మండలం వట్టెం వద్ద ప్రమాదవశాత్తూ క్రూజర్ వాహనం బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి.

బిజినేపల్లి (మహబూబ్‌నగర్ జిల్లా) : బిజినేపల్లి మండలం వట్టెం వద్ద ప్రమాదవశాత్తూ క్రూజర్ వాహనం బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. లోకేష్, ఐశ్వర్య, సిద్ధార్థ అనే చిన్నారులతో పాటు మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
హైదరాబాద్ నుంచి కొల్లాపూర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. టైరు పంక్చర్ అవ్వడం వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. వీళ్లంతా కోడేరు మండలకేంద్రానికి చెందినవారుగా గుర్తించారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement