చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ఐదుగురు గాయపడ్డారు.
పలమనేరు : చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ఐదుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మదనపల్లెకు చెందిన ఆర్టీసీ బస్సు పలమనేరు నుంచి చిత్తూరు వైపు వెళుతూ... పలమనేరు వీటీఎస్ కల్యాణమండపం సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న బంగారుపాళ్యం మండలం టేకుమంద గ్రామానికి చెందిన మహదేవ (37), ఆయన భార్య శంకరమ్మ (32) అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్పత్రికి తరలిస్తుండగా దుర్గాప్రసాద్(18) అనే విద్యార్థి మృతి చెందాడు. కాగా క్షతగాత్రులను పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.