సంతమూరులో నగలు చోరీ | the jewelry theft in Santamuru | Sakshi
Sakshi News home page

సంతమూరులో నగలు చోరీ

Dec 12 2015 11:49 AM | Updated on Sep 3 2017 1:53 PM

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి మండలం సంతమూరు గ్రామంలో శనివారం తెల్లవారు జామున చోరీ జరిగింది.

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి మండలం సంతమూరు గ్రామంలో శనివారం తెల్లవారు జామున చోరీ జరిగింది. వెంకటరత్నం అనే వ్యక్తి ఇంట్లో దొంగలు పడి 52 సవర్ల బంగారు నగలు, అర కిలో వెండి పాత్రలు, రూ.11వేల నగదు దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రాజమండ్రి క్రైం డీఎస్పీ త్రినాథరెడ్డి, తూర్పు డీఎస్పీ సౌమ్యలత, రాజానగరం సీఐ శంకరనారాయణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి వేలిముద్రలు సేకరిస్తున్నారు.



 

Advertisement
 
Advertisement
Advertisement