రేపు దేవరపల్లిలో వైఎస్‌ జగన్‌ పర్యటన | Ys Jagan to Visit Devarapalli Tobacco Auction Centre on August 5 | Sakshi
Sakshi News home page

రేపు దేవరపల్లిలో వైఎస్‌ జగన్‌ పర్యటన

Aug 4 2026 2:32 AM | Updated on Aug 4 2026 2:32 AM

 Ys Jagan to Visit Devarapalli Tobacco Auction Centre on August 5

పొగాకు కొనుగోలు కేంద్రం సందర్శన 

కొనుగోళ్ల పరిశీలన–రైతులతో ముఖాముఖి  

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 5న తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, కొనుగోళ్ల తీరును పరిశీలించడంతోపాటు ఆ రైతులతో నేరుగా మాట్లాడనున్నారు. 

పర్యటనలో భాగంగా బుధవారం ఉ.9.30 గంటలకు వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలో బయల్దేరి, ఉ.10.30కు దేవరపల్లి చేరుకుంటారు. అక్కడి పొగాకు కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న కొనుగోళ్లను పరిశీలిస్తారు. అనంతరం.. పొగాకు రైతులతో ముఖా­ముఖి నిర్వహించి, పంట సాగు, గిట్టుబాటు ధర, కొనుగోళ్లు, సమస్యలు తదితర అంశాలను నేరుగా వారిని అడిగి తెలుసుకుంటారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement