సీమాంధ్రకు రెండు రాజధానులివ్వాలి: టీజీ | tg venkatesh seeks two capitals for seemandhra | Sakshi
Sakshi News home page

సీమాంధ్రకు రెండు రాజధానులివ్వాలి: టీజీ

Feb 23 2014 11:58 PM | Updated on Sep 2 2017 4:01 AM

సీమాంధ్ర ప్రాంతానికి రెండు రాజధానులను ఏర్పాటుచేయాలని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు.

కర్నూలు, న్యూస్‌లైన్: సీమాంధ్ర ప్రాంతానికి రెండు రాజధానులను ఏర్పాటుచేయాలని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. కర్నూలులో పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రాజధానులు లేకపోతే సీమ ప్రజలు మరోసారి మోసపోక తప్పదన్నారు. 1953లో కర్నూలు రాజధానిని కోల్పోయిందన్నారు. లేనిపక్షంలో కోస్తా, సీమ రెండు ప్రాంతాల్లో రాజధానులను ఏర్పాటుచేసి, ఇరు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement