ఈ సూచనలు పాటించండి

TET Instructions in exams - Sakshi

ఆరిలోవ(విశాఖ తూర్పు): ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌(టెట్‌)–2018కు హాజరయ్యే అభ్యర్థులు పూర్తిగా సన్నద్ధంకావాలని డీఈవో బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు. జిల్లాలో 18 కేంద్రాల్లో బుధవారం నుంచి మార్చి 3వ తేదీ వరకు  పరీక్షలు జరగనున్నాయని చెప్పారు. కంప్యూటర్‌ బేస్‌డ్‌గా నిర్వహించే ఈ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30  నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో జరుగుతాయన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కొన్ని సూచనలు పాటించాలని సూచించారు.  

అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు గంట ముందుగా చేరుకోవాలి.
హాల్‌ టిక్కెట్‌పై ఉన్న పరీక్ష కేంద్రం, తేదీ, సమయం, రిజిస్టర్‌ నంబరు సరిచూసుకోవాలి..
అడ్మిట్‌ కార్డుపై ఉన్న పాస్‌వర్డ్‌ను ఉపయోగించి ‘లాగిన్‌’ అవ్వాలి. లాగిన్‌ అయిన తర్వాత కంప్యూటర్‌లో ఉన్న వివరాలు సరిచూడాలి. అన్నీ సరిగా ఉంటే ‘కన్‌ఫర్మ్‌’ అని, లేకుంటే ‘ఐ డెనీ’ అని క్లిక్‌ చేయాలి.
కంప్యూటర్‌ బాగా పనిచేస్తుందని, వివరాలు అందుబాటులో ఉన్నాయని క్లిక్‌ చేయాలి.
అనంతరం నేను ప్రారంభించుటకు సిద్ధంగా ఉన్నాను అని క్లిక్‌ చేయాలి.
ఇచ్చిన నాలుగు జవాబుల నుంచి సరైన దాన్ని ఎన్నుకొని క్లిక్‌ చేయాలి.
పరీక్ష రాస్తున్నప్పుడు మిగిలిన సమయం కంప్యూటర్‌లో పరిశీలించవచ్చు.
జవాబు రాయని ప్రశ్నలు ఎరుపు, ప్రయత్నించని ప్రశ్నలు తెలుపు, ప్రయత్నించిన ప్రశ్నలు ఆకుపచ్చ, పునఃపరిశీలనకు గుర్తించిన ప్రశ్నలు, జవాబు ఇచ్చిన ప్రశ్నలు ఊదా రంగులలో కనిపిస్తాయి.
ప్రశ్నకు జవాబు రాసిన అనంతరం ‘సేవ్‌’ తర్వాత ‘నెక్స్‌›్ట’ బటన్‌ నొక్కాలి.
కుడివైపు సెక్స్‌న్‌ బటన్‌ నొక్కడం వల్ల జవాబు ఇచ్చిన, ఇవ్వని, పునఃపరిశీలన ప్రశ్నలు కనిపిస్తాయి.
కంప్యూటర్‌లో ఇచ్చిన అక్షరాల సైజు కనిపించకపోతే వెంటనే ఇన్విజిలేటరు దృష్టికి తీసుకెళ్లాలి.
పరీక్ష సమయం  2.30 గంటలు పూర్తి కాగానే ‘సబ్మిట్‌’ అని బటన్‌ యాక్టివేట్‌ చేయాలి.
దృష్టి లోపం ఉన్నవారికి, అంగవికలాంగులకు అదనంగా 50 నిమిషాలు సమయం ఇవ్వనున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top