సభలో సొమ్మసిల్లిన టీడీపీ ఎంపీ సీఎం రమేష్ | TDP MP CM Ramesh fainted in Rajya sabha | Sakshi
Sakshi News home page

సభలో సొమ్మసిల్లిన టీడీపీ ఎంపీ సీఎం రమేష్

Aug 8 2013 4:06 PM | Updated on Aug 10 2018 7:07 PM

సభలో సొమ్మసిల్లిన టీడీపీ ఎంపీ సీఎం రమేష్ - Sakshi

సభలో సొమ్మసిల్లిన టీడీపీ ఎంపీ సీఎం రమేష్

టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ గురువారం సభలో సొమ్మసిల్లి పడిపోయారు.

న్యూఢిల్లీ : టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ గురువారం సభలో సొమ్మసిల్లి పడిపోయారు. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌, వి వాంట్‌ జస్టిస్‌  అంటూ గత కొన్ని రోజులుగా రాజ్యసభలో ఆందోళన చేస్తున్న ఆయన ఈరోజు సభ జరుగుతుండగా  స్పృహ తప్పిపడిపోయారు.  కంపెనీల బిల్లుపై రాజ్యసభలో బీఎస్పీ సభ్యుడు మాట్లాడుతున్న సమయంలో హఠాత్తుగా రమేష్‌ కిండ పడిపోయారు. ఈ విషయం గమనించిన రాజ్యసభ ఉపాధ్యక్షుడు పి.జె.కురియన్‌ సభను 10 నిమిషాలు సేపు వాయిదా వేశారు. సీఎం రమేష్ ను చంద్రబాబు నాయుడు ఫోన్ లో పరామర్శించారు.

కాగా టీడీపీ మరో ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి  సమక్యాంధ్ర విషయంలో టీడీపీ స్టాండ్‌ ఏంటో చెప్పకనే చెప్పారు. తాము తెలంగాణ ఏర్పాటుకు ఏమాత్రం వ్యతిరేకం కాదన్నారు. తాను మాట్లాడినా, తమ నేత చంద్రబాబు చెప్పినా ఈ విషయంలో ఎలాంటి అస్పష్టత లేదని ఢిల్లీలో వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement