చెరకు క్రషింగ్ లేనట్టేనా ? | sugar cane | Sakshi
Sakshi News home page

చెరకు క్రషింగ్ లేనట్టేనా ?

Dec 8 2014 3:18 AM | Updated on Jul 28 2018 6:48 PM

చెరకు క్రషింగ్ లేనట్టేనా ? - Sakshi

చెరకు క్రషింగ్ లేనట్టేనా ?

కోవూరు చక్కెర కర్మాగారానికి పూర్వవైభవం తెస్తానన్న సీఎం చంద్రబాబునాయుడు మాటలు నీటి మూటలుగానే మిగిలారుు.

బుచ్చిరెడ్డిపాళెం : కోవూరు చక్కెర కర్మాగారానికి పూర్వవైభవం తెస్తానన్న సీఎం చంద్రబాబునాయుడు మాటలు నీటి మూటలుగానే మిగిలారుు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీలు కేవలం నివేదికలు ఇవ్వడానికే పరిమితమయ్యాయి. ఫ్యాక్టరీ ఆర్థిక పరిస్థితులను లక్ష్మీనరసింహ కమిటీ పరిశీలించింది
 
  రైతులు, రైతు సంఘాల నాయకులతో మాట్లాడింది. మళ్లీ ఈ నెల 9, 10 తేదీల్లో మరో కమిటీ ప్లాంటేషన్ తదితర విషయాలపై పరిశీలించేందుకు రానుంది. ఈ ఏడాది కర్మాగారంలో క్రషింగ్ నిలిచిపోరుుంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పట్టిన దుస్థితే మళ్లీ తలెత్తిందని రైతులు విమర్శిస్తున్నారు. జిల్లాకే తలమానికంగా నిలిచిన కోవూరు సహకార చక్కెర కర్మాగారం పరిస్థితి దారుణంగా మారింది. ఈ ఏడాది ఫ్యాక్టరీ పరిధిలోని రైతులు లక్ష టన్నుల వరకు చెరకు సాగు చేశారు. ఏటా డిసెంబరులో ఫ్యాక్టరీ ప్రారంభమవుతుంది.
 
  రైతులు, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు, ప్రస్తుతం ఫ్యాక్టరీ నడిచేందుకు కావాల్సిన నిధులు విడుదల చేయాలని వివిధ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ క్రమంలో రైతులకు రూ. 4.41 కోట్లు, కార్మికుల జీతాలు రూ.6 కోట్లు చెల్లించాల్సి ఉంది. మరమ్మతులు తదితరాలకు రూ.4 కోట్లు తప్పనిసరిగా కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాళెంలో జన్మభూమి- మాఊరు కార్యక్రమానికి వచ్చిన సీఎం చంద్రబాబు కోవూరు చక్కెర కర్మాగారానికి పూర్వవైభవం తెస్తానని ప్రకటించారు. ఫ్యాక్టరీ నడిచేందుకు తగిన చర్యలు తీసుకుంటానని ఇచ్చిన హామీ నేటికీ అమలు కాలేదు. అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు.
 
 నాయుడుపేట ఫ్యాక్టరీకి తరలింపు..
 కర్మాగారం పరిధిలో సాగు చేసిన లక్ష టన్నుల చెరకు ప్రస్తుతం క్రషింగ్ దశలో ఉంది. ఈ ఏడాది టన్ను చెరకుకు రూ.2,125 ధర నిర్ణయించారు. పంటకు పెట్టిన పెట్టుబడులకు నిర్ణయించిన ధరకు పొంతన లేకుండా పోయింది. విధిలేని పరిస్థితుల్లో రైతులు నాయుడుపేట ఫ్యాక్టరీకి చెరకును తరలిస్తున్నారు.
 
 మూతపడిన మూడు సహకార చక్కెర కర్మాగారాలు..
 రాష్ట్రంలో కడప, కోవూరు, జంపని(గుంటూరు) సహకార చక్కెర కర్మాగారాలు మూతపడ్డాయి. ఇదే కోవ లో ఉన్న రేణిగుంట, చిత్తూరు, అనకాపల్లి కర్మాగారాలకు నిధులు విడుదల చేయడంతో అవి కాస్తా ప్రారంభమయ్యా యి. ప్రభుత్వ సహకారం నోచుకోకపోవడంతో మూడు చక్కెర కర్మాగారాలు ప్రారంభంకాలేదు. వీటికి సంబంధించి దాదాపు రూ.25 కోట్లకుపైగా బకారుు లు చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం.
 
  పట్టించుకోని ప్రభుత్వం...
 కేరళకు చెందిన ఓ కంపెనీ కోవూరు చక్కెర కర్మాగారాన్ని ప్రారంభిస్తే రూ.7 కోట్లు ఇచ్చి ఆదుకుంటామని తెలిపింది. కర్మాగార అభివృద్ధికి తమ వంతు సహాయం అందిస్తామని స్పష్టం చేసింది. ఆ దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
 
 మయూరి కర్మాగారానికి
  తరలుతున్న కార్మికులు..
 కోవూరు చక్కెర కర్మాగారంలో పనిచేస్తున్న సీజనల్ కార్మికులు రోడ్డున పడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఏడాది క్రషింగ్ జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. సీజనల్ కార్మికులు చిత్తూరు జిల్లాలోని మయూరి కర్మాగారానికి తరలిపోతున్నారు. ఇప్పటికే తమకు జీతాల్లేక కుటుంబపోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 గత దుస్థితే మళ్లీ..
  2002, 2003 సంవత్సరంలో చెర కు కర్మాగారం మూతపడింది.  నామా నాగేశ్వరరావుకు రూ.21 కోట్లకే  కర్మాగారాన్ని అమ్మేశారు. ప్రభుత్వ ధర ప్రకారం రూ.30 కోట్లకు పైగా ఉన్నా తక్కువ రేటుకే విక్రరుుంచారు. ఈ అంశంపై భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ ధర కాకుండా తక్కువగా అమ్మాల్సిన అవసరం ఏం వచ్చిందని ఆ సమయంలో కోర్టు స్టే ఇచ్చింది.
 
  అనంతరం వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యారు. సహకార రంగంలోని చక్కెర పరిశ్రమలను అమ్మే ప్రసక్తి లేదని, కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించేందుకు అప్పట్లో ఆయన చర్యలు తీసుకున్నారు. 2004లో ప్రారంభించి వరుసగా లక్షల టన్నుల చెరకు క్రషింగ్ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. మళ్లీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం రావడంతో ఫ్యాక్టరీ అమ్మడం ఖాయమని రైతులు ఆవేదన చెందుతున్నారు.
 
 రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం :
 రైతులు, కార్మికులకు బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. ఫ్యాక్టరీ నడిచేందుకు తగిన మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలి. ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేస్తే సహించం. ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం.                
 - సూరా శ్రీనివాసులు రెడ్డి,
 జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement