మృత్యుఒడికీ కలిసే.. | students are died in road accident | Sakshi
Sakshi News home page

మృత్యుఒడికీ కలిసే..

Jul 16 2014 3:06 AM | Updated on Sep 2 2017 10:20 AM

మృత్యుఒడికీ కలిసే..

మృత్యుఒడికీ కలిసే..

ఆగి ఉన్న కంటెయినర్‌ను ఢీకొని బైక్‌పై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. 65వ నంబరు జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.

మూలపాడు,(ఇబ్రహీంపట్నం రూరల్) : ఆగి ఉన్న కంటెయినర్‌ను ఢీకొని బైక్‌పై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. 65వ నంబరు జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. విజయవాడకు చెందిన గొల్లపల్లి పురుషోత్తమ చౌదరి పోలీస్ కానిస్టేబుల్‌గా ఐతవరంలో విధులు నిర్వర్తిస్తూ కుటుంబంతో కలిసి అక్కడే ఉంటున్నారు. పురుషోత్తమ చౌదరి కుమారుడు గొల్లపల్లి రాజేష్(19), అంబారుపేటకు చెందిన కట్ర సత్యనారాయణ(19) స్నేహితులు. వీరిద్దరూ మోటారుసైకిల్‌పై విజయవాడకు బయలుదేరారు.
 
ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు వద్ద మరమ్మతులకు గురై రహదారికి కుడి వైపున రాంగ్‌రూట్‌లో నిలిపి ఉన్న కంటెయినర్‌ను వెనక నుంచి ఢీకొన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. రాజేష్ పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం, సత్యనారాయణ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఎస్‌ఐ కృష్ణ ఘటనాస్థలానికి చేరుకుని మృతుల వివరాలు సేకరించి సమాచారాన్ని బంధువులకు తెలియజేశారు. పంచనామా నిర్వహించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement