ఓఎంసీ కేసులో.. శ్రీనివాసరెడ్డికి 26 వరకు రిమాండ్


సాక్షి, హైదరాబాద్: తాత్కాలిక బెయిల్ ముగియడంతో ఓఎంసీ కేసు నిందితుడు బీవీ శ్రీనివాసరెడ్డి బుధవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో లొంగిపోయారు. దీంతో శ్రీనివాసరెడ్డి రిమాండ్‌ను ఈ నెల 26 వరకు పొడిగిస్తున్నట్టు న్యాయమూర్తి వెల్లడించారు. తన భార్య విరిగిన కాలిలో ఉన్న రాడ్లను తొలగించే చికిత్స చేయించేందుకు వీలుగా శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక కోర్టు 9 రోజులపాటు షరతులతో కూడిన ఎస్కార్ట్ బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top