రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ సూచనలు | Sivaramakrishnan committee suggests on Andhra pradesh capital | Sakshi
Sakshi News home page

రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ సూచనలు

Jul 26 2014 4:52 PM | Updated on Jul 28 2018 3:23 PM

శివరామకృష్ణన్ కమిటీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికపై ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది. రాజధాని ఎంపికపై కీలక సూచనలు, సలహాలు అందజేసింది. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లోని వాస్తవ పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించింది.

రాయలసీమలో కరువు ఎక్కువగా ఉందని, దీనికి తోడు నీటి సమస్య కూడా ఉందని శివరామకృష్ణన్ కమిటీ వివరించింది. రాయలసీమలో అన్ని ప్రాంతాలకు కేంద్రబిందువుగా ఉండకపోవచ్చని పేర్కొంది. కృష్ణా-గుంటూరు మధ్య రాజధానిని నిర్మించడం అనువుగా ఉంటుందని తెలియజేసింది. అయితే ఈ ప్రాంతంలో నీటిసమస్య కొత వరకు ఉందని, భూసేకరణ కూడా కష్టమని వెల్లడించింది. జాతీయ స్థాయి వైద్య సంస్థలు అందరికీ అందుబాటులో ఉన్న చోట పెట్టాలని సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement