విధి వింత పరీక్ష | Sister Compleats Funeral Programme in Srikakulam | Sakshi
Sakshi News home page

విధి వింత పరీక్ష

Mar 5 2019 8:55 AM | Updated on Mar 5 2019 8:55 AM

Sister Compleats Funeral Programme in Srikakulam - Sakshi

తలకొరివి పెడుతున్న కుమారి

శ్రీకాకుళం, సోంపేట: విధి ఆ కుటుంబంతో ఆడుకుంటూనే ఉంది. విధిరాతను ఎదిరించి నిలిచిన ప్రతిసారీ ఏదో పరీక్ష పెడుతూనే వచ్చింది. అఖరికి మరణంలోనూ మరో పరీక్ష పెట్టి చెల్లితో తలకొరివి పెట్టించింది. మండలంలోని సిరిమామిడి గ్రామానికి చెందిన పొట్టి రామారావుకు నలుగురు పిల్లలు. ఇద్దరు కుమార్తులు, ఇద్దరు కుమారులు. కుమార్తెలు కుసుమ, కుమారికి చెవిటి, మూగ.  కుమారులు రామకృష్ణ, హరికృష్ణ దివ్యాంగులు. రామకృష్ణ(40) కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతూ శివరాత్రి రోజు సోమవారం ఉదయం మృతి చెందారు.

తండ్రి అనారోగ్యంతో ఉండటం, దగ్గర బంధువులు ఎవరూ తలకొరివి పెట్టడానికి ముందుకు రావకపోవడంతో దివ్యాంగురాలైన రామకృష్ణ సోదరి కుమారి తల కొరివి పెట్టి అన్న రుణం తీర్చుకుంది. హరికృష్ణ ప్రస్తుతం అండమాన్‌లో ఉన్నారు. వీరు నలుగురూ ఏరోజు బాధపడకుండా ఉన్నంతలో ఆనందంగా గడిపారు. తల్లి 25 ఏళ్ల కిందటే మృతి చెందారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement