విధి వింత పరీక్ష

Sister Compleats Funeral Programme in Srikakulam - Sakshi

అన్నకు తలకొరివి పెట్టిన చెల్లి

శ్రీకాకుళం, సోంపేట: విధి ఆ కుటుంబంతో ఆడుకుంటూనే ఉంది. విధిరాతను ఎదిరించి నిలిచిన ప్రతిసారీ ఏదో పరీక్ష పెడుతూనే వచ్చింది. అఖరికి మరణంలోనూ మరో పరీక్ష పెట్టి చెల్లితో తలకొరివి పెట్టించింది. మండలంలోని సిరిమామిడి గ్రామానికి చెందిన పొట్టి రామారావుకు నలుగురు పిల్లలు. ఇద్దరు కుమార్తులు, ఇద్దరు కుమారులు. కుమార్తెలు కుసుమ, కుమారికి చెవిటి, మూగ.  కుమారులు రామకృష్ణ, హరికృష్ణ దివ్యాంగులు. రామకృష్ణ(40) కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతూ శివరాత్రి రోజు సోమవారం ఉదయం మృతి చెందారు.

తండ్రి అనారోగ్యంతో ఉండటం, దగ్గర బంధువులు ఎవరూ తలకొరివి పెట్టడానికి ముందుకు రావకపోవడంతో దివ్యాంగురాలైన రామకృష్ణ సోదరి కుమారి తల కొరివి పెట్టి అన్న రుణం తీర్చుకుంది. హరికృష్ణ ప్రస్తుతం అండమాన్‌లో ఉన్నారు. వీరు నలుగురూ ఏరోజు బాధపడకుండా ఉన్నంతలో ఆనందంగా గడిపారు. తల్లి 25 ఏళ్ల కిందటే మృతి చెందారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top