వణుకుతున్న విశాఖ మన్యం | Shivering Visakha manyam | Sakshi
Sakshi News home page

వణుకుతున్న విశాఖ మన్యం

Dec 19 2016 2:34 AM | Updated on Apr 3 2019 9:27 PM

వణుకుతున్న విశాఖ మన్యం - Sakshi

వణుకుతున్న విశాఖ మన్యం

తుపాను ప్రభావంతో కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టిన చలి పులి మళ్లీ పంజా విసిరింది. విశాఖ జిల్లా ఏజెన్సీలో ఈ సీజన్‌లోనే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

లంబసింగిలో 2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత

చింతపల్లి: తుపాను ప్రభావంతో కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టిన చలి పులి మళ్లీ పంజా విసిరింది. విశాఖ జిల్లా ఏజెన్సీలో ఈ సీజన్‌లోనే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చింతపల్లిలో ఆదివారం 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానం సాంకేతిక విభాగం అధికారి ప్రవీణ్‌ తెలిపారు. దీంతో  లంబసింగిలో 2 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని అంచనా వేశారు.

సాధారణంగా చింతపల్లి ఉష్ణోగ్రత కన్నా లంబసింగిలో 3 డిగ్రీలు తక్కువ ఉంటుంది. చింతపల్లిలో శనివారం 8 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రత ఆదివారానికి 5 డిగ్రీలకు పడిపోవడంతో గిరిజనులు చలికి గజగజ వణికిపోతున్నారు. లంబసింగిలో ఉదయం 11 గంటల వరకు మంచు దట్టంగా కురిసింది. దీంతో స్థానికులు మిట్ట మధ్యాహ్నం కూడా ఉన్ని దుస్తులు ధరించుకుని తిరగాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement