బయటపడిన సంగమేశ్వర ఆలయ గోపురం | Sangameshwaram Temple Gopuram Visible | Sakshi
Sakshi News home page

బయటపడిన సంగమేశ్వర ఆలయ గోపురం

Feb 17 2020 4:22 PM | Updated on Feb 17 2020 4:22 PM

Sangameshwaram Temple Gopuram Visible - Sakshi

కృష్ణమ్మ ఒడి నుంచి బయటపడిన సంగమేశ్వర ఆలయ గోపురం

సప్తనదుల సంగమేశ్వర ఆలయ గోపురం కృష్ణమ్మ ఒడి నుంచి బయటపడింది.

సాక్షి, నందికొట్కూరు: కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని సప్తనదుల సంగమేశ్వర ఆలయ గోపురం ఆదివారం కృష్ణమ్మ ఒడి నుంచి బయటపడింది. సంగమేశ్వర ఆలయం 2019 జూలై రెండో వారంలో కృష్ణమ్మ ఒడిలోకి వెళ్లింది. శ్రీశైలం డ్యాం బ్యాక్‌ వాటర్‌ ఆదివారం 866 అడుగులకు చేరడంతో ఆలయ శిఖరం బయటపడింది. సంగమేశ్వరుడు పూర్తిగా బయటపడాలంటే బ్యాక్‌ వాటర్‌ 837 అడుగులకు రావాల్సి ఉంటుంది. ఇందుకు సుమారు 29 రోజులు పడుతుందని ఆలయ పురోహితుడు తెల్లకపల్లి రఘురామశర్మ చెప్పారు. (హంస వాహనాధీశా.. హరోం హర)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement