భవానీ భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిట
సాక్షి, విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రికి భవానీ భక్తులు పోటెత్తారు. భవానీ దీక్షల విరమణ బుధవారం నాలుగో రోజుకు చేరుకుంది. భవానీ దీక్షల విరమణ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు విజయవాడకు చేరుకుంటుండడంతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడిపోతోంది. అలాగే అమ్మవారి దర్శనానికి తెల్లవారుజామునుంచే భక్తులు బారులుతీరారు.