ఆటో లారీ ఢీ

Road Accident In Chittoor District - Sakshi

ఆరుగురికి తీవ్రగాయాలు

పులిచెర్ల(కల్లూరు) : కల్లూరు – పీలేరు జాతీయ రహదారిలోని అయ్యావాండ్లపల్లె బస్‌ స్టాప్‌ వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పీలేరు వైపు వెళుతున్న లారీ కల్లూరువైపు వస్తున్న ప్యాసింజరు ఆటోను ఢీకొన్న ఘటనలో  ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన వారిలో పీలేరు మోడల్‌ కాలనీకి చెందిన గురప్ప(55), రేవతి(40), ఇందిరమ్మ కాలనీకి చెందిన సరస్వతి(47), సుభా కాంక్షిణి(22), మనోహర్‌ (6నెలలు), ఎగువపోకలవారి పల్లెకు చెందిన హంసవేణి(27) ఉన్నారు. కల్లూరు ఎస్‌ఐ విశ్వనాథ నాయుడు క్షతగాత్రులను పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రూయాకు తీసుకెళ్లారు. కాగా ప్రమాదానికి కారణమై, ఆగకుండా వెళ్లిపోయిన లారీ డ్రైవర్‌ను పీలేరు సమీపంలో అదుపులోకి తీసుకొన్నట్లు పోలీసులు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top