ఆటో లారీ ఢీ | Road Accident In Chittoor District | Sakshi
Sakshi News home page

ఆటో లారీ ఢీ

Apr 12 2018 10:59 AM | Updated on Aug 30 2018 4:20 PM

Road Accident In Chittoor District - Sakshi

రోడ్డుప్రమాదంలో గాయపడిన చిన్నారి మనోహర్‌, సరస్వతి 

పులిచెర్ల(కల్లూరు) : కల్లూరు – పీలేరు జాతీయ రహదారిలోని అయ్యావాండ్లపల్లె బస్‌ స్టాప్‌ వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పీలేరు వైపు వెళుతున్న లారీ కల్లూరువైపు వస్తున్న ప్యాసింజరు ఆటోను ఢీకొన్న ఘటనలో  ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన వారిలో పీలేరు మోడల్‌ కాలనీకి చెందిన గురప్ప(55), రేవతి(40), ఇందిరమ్మ కాలనీకి చెందిన సరస్వతి(47), సుభా కాంక్షిణి(22), మనోహర్‌ (6నెలలు), ఎగువపోకలవారి పల్లెకు చెందిన హంసవేణి(27) ఉన్నారు. కల్లూరు ఎస్‌ఐ విశ్వనాథ నాయుడు క్షతగాత్రులను పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రూయాకు తీసుకెళ్లారు. కాగా ప్రమాదానికి కారణమై, ఆగకుండా వెళ్లిపోయిన లారీ డ్రైవర్‌ను పీలేరు సమీపంలో అదుపులోకి తీసుకొన్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement