సోమేశ్వరుని సన్నిధిలో ‘పూరీ’ కుటుంబం | Puri Jagannadh family Visit in someshwara temple | Sakshi
Sakshi News home page

సోమేశ్వరుని సన్నిధిలో ‘పూరీ’ కుటుంబం

Nov 5 2014 2:13 AM | Updated on Sep 2 2017 3:51 PM

సోమేశ్వరుని సన్నిధిలో ‘పూరీ’ కుటుంబం

సోమేశ్వరుని సన్నిధిలో ‘పూరీ’ కుటుంబం

కార్తీక మాసం సందర్భంగా సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ సతీమణి లావణ్య, కుమారుడు ఆకాష్, కుమార్తె పవిత్ర మంగళవారం భీమవరం గునుపూడిలోని పంచారామక్షేత్రామైన

 భీమవరం అర్బన్: కార్తీక మాసం సందర్భంగా సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ సతీమణి లావణ్య, కుమారుడు ఆకాష్, కుమార్తె పవిత్ర మంగళవారం భీమవరం గునుపూడిలోని పంచారామక్షేత్రామైన సోమేశ్వరాలయాన్ని సందర్శించారు. సోమేశ్వరుడ్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకుల నుంచి వేద ఆశీర్వచనాలు పొందారు. అనంతరం లావణ్య విలేకరులతో మాట్లాడుతూ పంచారామాల దర్శనంలో భాగంగా ఇక్కడకు వచ్చామని చెప్పారు. సోమేశ్వరుడ్ని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. బాలనటుడు ఆకాష్ మాట్లాడుతూ తనకు నటనంటే ఎంతో ఇష్టమని, ఇప్పటివరకు ఏడు సినిమాల్లో నటించానని చెప్పాడు. ముందుగా వీరు పాలకొల్లులోని క్షీరారామలింగేశ్వరుడ్ని దర్శించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement