ప్రైవేట్‌ బస్సు బోల్తా.. 15మందికి గాయాలు | private travel bus road accident in kurnool  | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ బస్సు బోల్తా.. 15మందికి గాయాలు

Feb 28 2018 7:55 AM | Updated on Aug 30 2018 4:20 PM

సాక్షి, కర్నూలు: జిల్లాలో ఓ ప్రైవేట్‌ బస్సు జాతీయ రహదారి 44పై ప్రమాదానికి గురైంది. ఈ సంఘటన ప్యాపిలి మండలం పొదొడ్డి గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. వివరాలివి.. వీర ట్రావెల్స్‌ బస్సు మంగళవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు  ప్రయాణికులతో బయలుదేరింది. వేగంగా ప్రయాణిస్తున్న బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి జాతీయ రహదారిపై బోల్తా పడింది. 

ఈ ఘటనలో 15మంది ప్రయాణికులకు గాయలయ్యాయి. ఇద్దరి డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement