మడకశిర : చింతపండు ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. దీంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. జిల్లాలోనే మడకశిర నియోజకవర్గం చింత పండు ఉత్పత్తిలో ప్రసిద్ధి. ఈ ప్రాంతం రైతులు వేరుశనగ పంట సాగు చేసి నష్టాల్లో కూరుకుపోయిన పరిస్థితుల్లో ఈ చింత పండు అంతో ఇంతో ఆర్థికంగా ఆదుకుంటోంది. ఈ నేపథ్యంలో రెండు వారాల నుంచి చింత పండు ధర తగ్గడంతో రైతుల పరిస్థితి కడుదయనీయం గా మారింది. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలోని రైతులు రెండు రకాల చింత పండును ఉత్పత్తి చేస్తున్నారు.
ఇందులో కర్పుడి మొదటి రకం చింత పండు. రెండో రకం ఫ్లవర్ చింత పండు. చింత పండు సీజన్ ప్రారంభంలో మొదటి రకం (కర్పుడి) చింత పండు క్వింటాల్ ధర రూ.12వేల వరకు పలి కింది. అయితే ప్రస్తుతం ఈ ధర రూ.7,500లకు పడిపోయిం ది. క్వింటాల్పై రూ.4,500 తగ్గడంతో రైతులు నష్టపోతున్నారు. అదేవిధంగా రెండో రకం (ఫ్లవర్)చింత పండు ధర ప్రారంభంలో రూ.8వేల వరకు పలికింది. ప్రస్తుతం ఈ ధర రూ.4,500 పడిపోయింది. క్వింటాల్పై రూ.3,500 తగ్గడంతో రైతులకు శాపంగా మారింది. చింత పండు ధర మార్కెట్లో నిల కడగా లేకపోవడంతో రైతుల పరిస్థితి దారుణంగా మారింది.
కొంపముంచిన వర్షం
నియోజకవర్గంలో అకాల వర్షం రైతుల కొంప ముంచింది. ఈ వర్షంతో చింత పండు రంగు మారింది. దీంతో నాణ్యత తగ్గడంతో రైతులు నష్టపోవడానికి కారణమైంది. అంతే కాకుండా చింత పండు ధర తగ్గినా కూడా కూలీల ధరలు తగ్గలేదు. దీంతో రైతులకు ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం చెట్లలో చింత పండు కోయడానికి రోజుకు రూ.300 కూలీ చెల్లిస్తున్నా రు. అదేవిధంగా ఇలా కోసిన చింతకాయలను ఏరడానికి రోజుకు రూ.200 కూలీ ఇస్తున్నారు. చింత పండు ధర తగ్గడం కూలీ ధరలు అలాగే ఉండటంతో రైతులు నష్టాల బాట పట్టారు.
మడకశిరలో మార్కెట్ సౌకర్యం నిల్
మడకశిరలో చింత పండు మార్కెట్ లేకపోవడం రైతులకు ఇబ్బందిగా మారింది. గతంలో మడకశిర మార్కెట్ యార్డులో చింత పండు క్రయవిక్రయాలు జరిపేవారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన త ర్వాత క్రయవిక్రయా లు ఆగిపోయాయి. అంతే కా కుండా ఇంత వరకు మార్కెట్ యార్డుకు ప్రభుత్వం పాలక వర్గాన్ని కూడా నియమించలేదు. దీంతో ఈ ప్రాంతం రైతులు చింత పండును హిందూపురం మార్కెట్కు తరలిస్తున్నారు. దీంతో రవాణా ఖర్చులను రైతులు ఎక్కువగా భరించాల్సి వస్తోంది. హిందూపురం మార్కెట్లో దళారుల బెడద అధికంగా ఉంది. కమీషన్ అధికంగా వసూలు చేస్తుండటంతో చింత పండు రైతులు నష్టపోవడానికి మరోకారణంగా మారింది. ఏదిఏమైనా చింత పండు ధరలు తగ్గుముఖం పట్టడం రైతులకు శాపంగా మారిందనడంలో సందేహం లేదు.
నష్టపోతున్నాం..
చింత పండు ధర తగ్గడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. ప్రారంభంలో చింత పండు ధర ఆశాజనకంగా ఉండేది. అయితే గత రెండు వారాల్లో చింత పండు ధర తగ్గడంతో నష్టం వస్తోంది. అంతే కాకుండా స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో మరింత ఆర్థిక భారం పడుతోంది. మడకశిర మార్కెట్యార్డులో చింత పండు క్రయవిక్రయాలు జరపాలి. వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుని చింత పండు రైతులను ఆదుకోవాలి.
- రఘునాథ్రెడ్డి, చింత పండు రైతు, పాపసానిపల్లి
ధర తగ్గింది ‘చింత’ పెరిగింది
Published Tue, Mar 10 2015 2:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆ సమస్యతో చాలా బాధపడ్డా, కానీ అదే కాపాడింది : సారా టెండూల్కర్
సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
బెంగాల్ గవర్నర్పై ఆరోపణలు: విచారణ జరపాలన్న మిసా భారతి
డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు
తప్పక చదవండి
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement