పిడుగురాళ్లలో భూకంపం | Piduguralla aera in Earthquake | Sakshi
Sakshi News home page

పిడుగురాళ్లలో భూకంపం

Jun 11 2016 1:08 AM | Updated on Sep 4 2017 2:10 AM

మధ్యాహ్నం భోజనం చేసి కునుకు తీస్తుండగా ఒక్కసారిగా ధభేల్‌మనే శబ్దం రావడంతో ఇంట్లో నుంచి బయటకు

సెకన్లపాటు కంపించిన భూమి
ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీసిన జనం
 

పిడుగురాళ్ల : మధ్యాహ్నం భోజనం చేసి కునుకు తీస్తుండగా ఒక్కసారిగా ధభేల్‌మనే శబ్దం రావడంతో ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశాడు రామయ్య... ఇదేం శబ్దమని ఇరుగుపొరుగు వారు కూడా భయంతో గృహాల్లో నుంచి బయటకు పరిగెత్తారు. అందరూ ఒకచోటకు చేరి ఏమైందంటూ చర్చించుకున్నారు. భూకంపం వచ్చిందని ఓ పెద్దాయన చెప్పాడు. దీంతో వామ్మో పిడుగురాళ్లకు భూకంపం వచ్చిందా అంటూ పట్టణవాసులంతా ఉలిక్కిపడ్డారు.

పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డుతో పాటు జానపాడు రోడ్డు, బస్టాండ్ సమీపంలో, పిల్లుట్ల రోడ్డు, శివాలయం బజారు, గంగమ్మగుడి ప్రాంతాలలో పెద్ద శబ్దం వచ్చింది. పట్టణంలోని ప్రధాన రహదారుల్లో ఉన్న వ్యాపారులు కూడా భూకంప శబ్దంతో దుకాణాల నుంచి బయటకు పరుగులు తీశారు. శబ్దం వచ్చిందే త;్ఛజి; గృహాలు, షాపుల్లోని సామాన్లు కింద పడడం వంటి సంఘటనలు జరగలేదు.  మధ్యాహ్నం 3.10 గంటలకు ఒక్క సెకను ఈ ఘటన సంభవించింది. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement