అన్నం నిండా పురుగులు..కూరగా కుళ్లిన గుడ్లు!
తినకుండా ఇంటిబాట పట్టిన విద్యార్థులు
అర్ధవీడు: మార్కాపురం జిల్లా అర్ధవీడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన ఘటన మధ్యాహ్న భోజన నాణ్యతను తేటతెల్లం చేసింది. మెనూ ప్రకారం విద్యార్థులకు శుక్రవారం వెజిటబుల్ రైస్, బంగాళాదుంప కుర్మా, కోడిగుడ్డు ఇవ్వాలి. కానీ, పురుగులు పడిన నాసిరకం బియ్యంతో వండిన అన్నం, టమాటా కర్రీ, కుళ్లిన కోడిగుడ్లు వడ్డించారు. ఆ దుర్వాసన భరించలేక, అన్నంలో పురుగులను చూసిన విద్యార్థులు ఉసూరుమంటూ ఇంటిబాట పట్టారు.




