వరద నీటిలో శ్మశానం.. ఖననం చేసేందుకు అవస్థలు
సాక్షి, కొల్లూరు(గుంటూరు): కొల్లూరు మండలంలోని ఆవులవారిపాలెం శివారు క్రీస్తులంకలో గడ్డం ధర్మారావు అనే వ్యక్తి మృతి చెందడంతో ఖననం చేసేందుకు బంధువులు, స్థానికులు గురువారం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్మశానం చుట్టూ వరద నీరు చేరడంతో మృతదేహాన్ని పడవ ద్వారా తరలించి ఖనన కార్యక్రమాలు ముగించారు.