- 12వ తేదీకీ అందని వైనం
- అల్లాడిపోతున్న అభాగ్యులు
- మూడు నెలలుగా ఇదే తంతు
- వైఎస్ పాలనలో ఒకటో తేదీనే పింఛన్
చల్లపల్లి : ‘అవనిగడ్డ మండలం బందలాయిచెరువు దళితవాడకు చెందిన గొర్రుముచ్చు దుర్గమ్మ అనే వృద్ధురాలికి పదో తేదీ దాటినా ఫించన్ అందక పోవడంతో మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేక మంచానపడింది’.'చల్లపల్లికి చెందిన సరోజనమ్మ అనే వృద్ధురాలు ఫించన్కోసం ప్రతిరోజూ కార్యాలయానికి వెళ్లి విసిగి వేసారిపోయి ఉసూరుమంటూ రోదిస్తూ తిరిగొస్తుంది. ఇలాంటి ఇబ్బందులు పడుతున్న వారు జిల్లాలో చాలా మందే ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఫించన్తో మందులు కొనుక్కుని బతికీడుస్తున్నవారు కొందరైతే, వాటితో పచ్చడి మెతుకులు తిని కడుపు నింపుకుంటున్నవారు మరికొందరు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతినెలా ఒకటో తేదీనే పింఛన్ అందుకునే అభాగ్యులు ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యంతో పదోతేదీ దాటినా పింఛన్ అం దక నానా ఇబ్బందులకు గురవుతున్నారు.
మూడు నెలల నుంచి ఇదేతంతు...
జిల్లాలో మొత్తం 3,12,028 మంది పింఛన్దారులున్నారు. వీరిలో 1,25,350 మంది వృద్ధాప్య, 1,15,686 మంది వితంతు, 44,838 వికలాంగ, 4,946 మంది చేనేత, 1,935 మంది కల్లుగీత, 20,273 మంది అభయహస్తం పింఛన్ దారులున్నారు. వీరికి ప్రతినెలా రూ.12,18,79,700 సొమ్ము ఇస్తున్నారు. ఈనెల 12వ తేదీ దాటినా పింఛన్ ఇవ్వకపోవడంతో వీరంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు నెలల నుంచి ఇదే తంతు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం సరిగా స్పందించక పోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ఉద్యోగస్తుల మాదిరి ఒకటో తేదీన పింఛన్లు అందుకునేవారమని, గతంలో చంద్రబాబు నాయుడు పాలనలో మూడు నెలలకు ఒకసారి పింఛన్లు ఇచ్చేవారని, మళ్లీ అవే రోజులు పునరావృతమవుతున్నాయని కొంతమంది వృద్ధులు గుర్తు చేసుకుంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పింఛన్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
మందులు ఆపేశాను
అనారోగ్యంతో బాధపడుతున్న నేను ప్రతి నెలా తప్పనిసరిగా మందులు వాడుతుంటాను. ఇంత వరకు పింఛన్ ఇవ్వకపోవడం వల్ల మందులు కొనేందుకు డబ్బులు లేవు. మందులు వేసుకోలేకపోతున్నాను. మందులు వేసుకోకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. పింఛన్ ఎప్పుడు ఇస్తారో ఏమో.
- గొర్రుముచ్చు దుర్గమ్మ, బందలాయిచెర్వు, అవనిగడ్డ మండలం
ప్రతి నెలా ఆలస్యమే..
గత మూడు నెలల నుంచి పింఛన్ల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. రెండు నెలల క్రితం పదిహేను రోజులు ఆలస్యంగా ఇచ్చారు. గత నెలలో వారం రోజుల తర్వాత ఇచ్చారు. ఈ నెలలో ఇంత వరకూ ఇవ్వలేదు. మూడు నెలల నుంచి ఇలాగే జరుగుతున్నా పట్టించుకునేవారే కరువయ్యారు.
- వెంపటి శేషమ్మ, కూచిపూడి
ఎన్నాళ్లీ పింఛన్ల వెతలు ?
Published Sun, Jul 13 2014 2:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సీఎం జగన్ ప్రభుత్వంలో ఉత్తరాంధ్రకు చేసిన అభివృద్ధి ఇదే
పథకాలు ఆపగలరు కానీ.. మా విజయాన్ని ఆపలేరు: సీఎం జగన్
మీ జగన్ మార్క్ పథకాలు ఇవి...!
అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం.. కొనసాగుతున్న ఉద్యోగాల కోతలు
ఓటీటీకి వచ్చేస్తోన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘ప్రజ్వల్ రేవణ్ణ’ పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement