కృష్ణా జిల్లా జి.కొండూరులో 33వ నెంబర్ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులు గురువారం ఆందోళనకు దిగారు.
కృష్ణా జిల్లా జి.కొండూరులో 33వ నెంబర్ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులు గురువారం ఆందోళనకు దిగారు. తమకు ప్రభుత్వం సరైన ఇవ్వటం లేదని రహదారిపై రాస్తారోకోకు దిగారు. మార్కెట్ రేటు ప్రకారం ఎకరా రూ.2 కోట్లు పలుకుతున్న భూములకు ప్రభుత్వం కేవలం రూ.16 లక్షలు మాత్రమే చెల్లిస్తుండటంతో ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం కనీసం రూ.కోటి ఐనా చెల్లించాలని ధర్నా చేపట్టారు. రైతులు చేపట్టిన రాస్తారోకోతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.