చిన్నారులకు పవన్ కళ్యాణ్ పరామర్శ | Pawan Kalyan visits train accident children | Sakshi
Sakshi News home page

చిన్నారులకు పవన్ కళ్యాణ్ పరామర్శ

Jul 24 2014 6:06 PM | Updated on Mar 22 2019 5:33 PM

చిన్నారులకు పవన్ కళ్యాణ్ పరామర్శ - Sakshi

చిన్నారులకు పవన్ కళ్యాణ్ పరామర్శ

మెదక్ జిల్లాలో పాఠశాల బస్సును రైలు ఢీకొన్న ఘటనపై సినీ నటుడు, జనసేన నేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

హైదరాబాద్: మెదక్ జిల్లాలో పాఠశాల బస్సును రైలు ఢీకొన్న ఘటనపై సినీ నటుడు, జనసేన నేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఆయన పరామర్శించారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.... రైలు ప్రమాద దుర్ఘటనలో చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందన్నారు. పిల్లలు సురక్షితంగా స్కూల్ వెళ్లలేని పరిస్థితులు నెలకొనడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు నష్టపరిహారంతోనే సరిపెట్టకుండా భవిష్యత్ లో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement