సాక్షి, హైదరాబాద్: లండన్లోని వెస్ట్ మినిస్టర్ బ్యాంకులో 7వ నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ దాచిన సొమ్ముపై ఇప్పుడు భారత్, పాకిస్థాన్ల మధ్య న్యాయపోరాటం సాగుతోంది. ఆ బ్యాంకులోని నిజాం నవాబు అకౌంటు నుంచి 1947-48 ప్రాంతంలో అప్పటి పాకిస్థాన్ హైకమిషనర్ హబీబ్ ఇబ్రహీం రహీముతుల్లా అకౌంట్లోకి భారీ మొత్తంలో డబ్బు లు బదిలీ అయ్యాయి. నిజాం ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రే అక్రమంగా ఆ డబ్బుల్ని బదిలీ చేశారు. ఆ విషయం తెలిసి దాన్ని తక్షణం నిలిపివేయాలని కోరుతూ లండన్ కోర్టులో నిజాం స్టే పొందారు.
1967లో నిజాం మృతి చెందారు. ఆ తరువాత స్టేను తొలగించి సొమ్మును కైవసం చేసుకోవడానికి పాకిస్థాన్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ మొత్తం భారీగా ఉండటంతో భారత ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. మొదట న్యాయస్థానం బయట చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావించి, అందుకనుగుణంగా చర్యలు తీసుకున్నప్పటికీ పరిష్కారం లభించలేదు. ఈ లోపు పాకిస్థాన్ ప్రభుత్వం వెస్ట్మినిస్టర్బ్యాంకులోని మొత్తం సొమ్మును తమకు బదలాయించాలంటూ లండన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దాంతో భారత ప్రభుత్వం కూడా న్యాయపోరాటం ప్రారంభించింది.
ఇందులో భాగంగా వెస్ట్మినిస్టర్ బ్యాంకులో నిజాం డిపాజిట్కు సంబంధించిన పత్రాలతో పాటు ఇతర ఆస్తులకు చెందిన వివరాలను, నిజాం డబ్బులు, ఆస్తులపై గతంలో వివిధ బ్యాంకులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో కూడిన డాక్యుమెంట్లను వెంటనే ఢిల్లీకి పంపాల్సిందిగా కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి సుజాతా సింగ్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతికి లేఖ రాశారు. ప్రస్తుతం రాష్ట్ర అధికారులు ఆ వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. నిజానికి, 1957 సంవత్సరంలోనే అప్పటి రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి వెస్ట్మినిస్టర్ బ్యాంకులో నిజాం దాచిన డబ్బుల విషయంపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సమాచారమిచ్చారు.
నిజాం సొమ్ము కోసం 'పాక్' లాట
Published Tue, Dec 10 2013 2:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement