బోల్తాపడిన చేపల లారీ, ఒకరి మృతి | one killed in west godavari accident | Sakshi
Sakshi News home page

బోల్తాపడిన చేపల లారీ, ఒకరి మృతి

Jun 25 2015 10:05 AM | Updated on Sep 3 2017 4:21 AM

పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకువీడు మండలం పెదకాపవరం సమీపంలో గురువారం ఉదయం ఓ చేపల లారీ అదుపు తప్పి బోల్తాపడింది.

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలో  ఆకువీడు మండలం  పెదకాపవరం సమీపంలో గురువారం ఉదయం ఓ చేపల లారీ అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా లారీ అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement