ప్రేమించి మోసం చేసిన యువకుడిపై కేసు | On the case of a young man in love with fraud | Sakshi
Sakshi News home page

ప్రేమించి మోసం చేసిన యువకుడిపై కేసు

Aug 6 2013 12:40 AM | Updated on Sep 1 2017 9:40 PM

ప్రేమ పేరుతో ఓ యువతిని గర్భవతిని చేసి, గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్ చేయించిన యువకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి సోమవారం తెలిపారు. ఆయన కథనం మేరకు..

తూప్రాన్, న్యూస్‌లైన్ : ప్రేమ పేరుతో ఓ యువతిని గర్భవతిని చేసి, గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్ చేయించిన యువకుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి సోమవారం తెలిపారు. ఆయన కథనం మేరకు.. తూప్రాన్ మండలంలోని యావపూర్‌కి చెందిన ఓ యువతి (19), అదే గ్రామానికి చెందిన నీలం శంకర్ కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే సదరు యువతి గర్భం దాల్చింది.
 
 అయితే  యువతికి అబార్షన్ చేయించాలన్న శంకర్ ప్రయత్నం విఫలం కావడంతో అమ్మాయిని వారి ఇంట్లోనే వదలి వెళ్లాడు. మరుసటి రోజు (జూలై 30న) ప్రియుడు ప్రియురాలిని వెంటబెట్టుకుని రంగారెడ్డి జిల్లా మేడ్చెల్‌లో ఉన్న ఓ స్నేహితుడి ఇంటికి  తీసుకెళ్లాడు.  అక్కడ పెళ్లి చేసుకుంటానని అమ్మాయిని నమ్మించి స్థానిక వైద్యుల సాయంతో అబార్షన్ అయ్యేందుకు మందులు ఇప్పించాడు. ఈ విషయం తెలిసిన యువతి కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో వారు అబార్షన్ చేసిన ఆస్పత్రికి వెళ్లి జరిగిన విషయమై ఆరా తీశారు. అనంతరం నీలం శంకర్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement