మెదక్ కలెక్టరేట్: ‘‘హెచ్ఐవీ పరీక్షలకు డిజిటల్ విధానం – క్యూఆర్ కోడ్తో సులభంగా సేవలు’’పోస్టర్ను కలెక్టర్ తన ఛాంబర్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ...హెచ్ఐవీ (ఎయిడ్స్)పై ప్రజల్లో అవగాహన పెంచడంతోపాటు, అవసరమైన వారికి పరీక్షలు, సేవలను మరింత సులభంగా అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో డిజిటల్ విధానాన్ని అందుబాటులోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా అధికారులు, తహసీల్దార్లు,ఎంపీడీఓలు, మండల ప్రత్యేక అధికారులు, ఏపీఓలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


