అధికారులు 'అవాక్కయ్యారు' | officials shocked to plexies in guntur | Sakshi
Sakshi News home page

అధికారులు 'అవాక్కయ్యారు'

Jan 17 2015 11:25 AM | Updated on Jul 12 2019 6:01 PM

గుంటూరు జిల్లా తాడేపల్లిలో పల్స్ పోలియో ప్లెక్సీల పంపకంలో అధికారులు అవాక్కయ్యారు.

గుంటూరు: గుంటూరు జిల్లా తాడేపల్లిలో పల్స్ పోలియో ప్లెక్సీల పంపకంలో అధికారులు అవాక్కయ్యారు. ప్లెక్సీలు తెలంగాణ ప్రభుత్వం పేరుతో రావటంతో కాసేపు కలకలం రేగింది. అధికారులు వెంటనే జిల్లా కలెక్టరుకు సమాచారం ఇచ్చారు. దీనిపై జిల్లా కలెక్టరు స్పందిస్తూ.. తప్పులు దొర్లటం సహజమేనని, ఈ సంఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

 

ఇక  రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరుతో ప్లెక్సీలు కనిపిస్తే ఏదో పొరపాటు జరిగిందనే అవకాశం ఉంది. అయితే ఏపీలో తెలంగాణ ప్రభుత్వం పేరుతో హోర్డింగులు రావటంపై విమర్శలు వస్తున్నాయి

Advertisement
 
Advertisement
Advertisement