రైల్వే ప్రయాణికుడి వీరంగం | Odisha Passenger Embarrassed by Other Passengers in Bokaro Express at Bobbili | Sakshi
Sakshi News home page

రైల్వే ప్రయాణికుడి వీరంగం

Jul 28 2019 8:10 AM | Updated on Jul 28 2019 8:11 AM

Odisha Passenger Embarrassed by Other Passengers in Bokaro Express at Bobbili - Sakshi

బోగీ ఎక్కిన ప్రయాణికుడు

బొబ్బిలి: విశాఖ నుంచి బొబ్బిలి వైపు వస్తున్న బొకారో ఎక్స్‌ప్రెస్‌ బోగీ మీదకి మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు ఎక్కి కలకలం సృష్టించాడు. శనివారం సాయంత్రం బొకారో ట్రైన్‌ను విజయనగరంలో రన్నింగ్‌లో ఎక్కిన ఒడిశా వాసి  పైన ఉండే విద్యుత్‌ తీగలను అం దుకోబోతుండటాన్ని గొట్లాం స్టేషన్‌ వద్ద గమనించిన లైన్‌మన్, టోకెన్‌ పోర్టర్‌లు స్టేషన్‌కు సమాచారమందించారు. వెంటనే స్టేషన్‌ సిబ్బం ది ∙బొకారో ట్రైన్‌ డ్రైవర్లక సమాచారమందించారు. దీంతో డ్రైవర్లు గరుగుబిల్లి వద్ద ట్రైన్‌ను నిలిపివేసి కిందికి దిగమని కేకలు వేశారు. అయినా మత్తు వీడని ప్రయాణికుడు చేతులు మీదికెత్తుతూ కాసేపు హల్‌చల్‌ చేశాడు. చివరకు కొందరు మీదికి ఎక్కి మద్యం మత్తులో ఉన్న ప్రయాణికుడ్ని కిందికి నెట్టేశారు. వెంటనే ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని బొబిŠబ్‌లి స్టేషన్‌కు తరలించారు. మద్యం మత్తులో ఉండడం వల్ల వివరాలు చెప్పలేకపోతున్నాడని రైల్వే పోలీసులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement