'వారం రోజుల్లో వర్షం రాకపోతే దుర్భిక్షమే' | No rains in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

'వారం రోజుల్లో వర్షం రాకపోతే దుర్భిక్షమే'

Aug 13 2015 7:17 PM | Updated on Jun 4 2019 5:04 PM

వారం రోజుల్లో కనీసం 10 మిల్లీ మీటర్ల వర్షం పడకపోతే రైతులు పెట్టిన పెట్టుబడులు బూడిదలో పోసిన పన్నీరు అయి.. తీవ్ర దుర్భిక్షం తాండవ మాడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

బి.కొత్తకోట (చిత్తూరు) : వారం రోజుల్లో కనీసం 10 మిల్లీ మీటర్ల వర్షం పడకపోతే రైతులు పెట్టిన పెట్టుబడులు బూడిదలో పోసిన పన్నీరు అయి.. తీవ్ర దుర్భిక్షం తాండవ మాడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. తిరుపతి వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు గురువారం బి.కొత్తకోటలోని వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా.. గ్రామంలో వేసిన వేరుశెనగ పంటను పరిశీలించి మరో వారం రోజుల్లో మొక్కలకు నీరు అందకపోతే వేరు నిర్జీవమైపోతుందని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement