‘పోలీసులే దగ్గరుండి పాదయాత్ర చేయిస్తారు’ | No permission to mudragda Padmanabham Padayatra, says Home minister chinarajappa | Sakshi
Sakshi News home page

‘పోలీసులే దగ్గరుండి పాదయాత్ర చేయిస్తారు’

Jul 13 2017 3:58 PM | Updated on Jul 30 2018 6:25 PM

‘పోలీసులే దగ్గరుండి పాదయాత్ర చేయిస్తారు’ - Sakshi

‘పోలీసులే దగ్గరుండి పాదయాత్ర చేయిస్తారు’

కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు అనుమతి లేదని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు.

అమరావతి: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు అనుమతి లేదని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ ఉద్యమాలతో ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఒకవేళ ముద్రగడ తన పాదయాత్రకు అనుమతి కోరితే పోలీసులే దగ్గరుండి పాదయాత్ర చేయిస్తారని చినరాజప్ప అన్నారు.

మరోవైపు డీజీపీ సాంబశివరావు ఏలూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు అనుమతి లేదని తెలిపారు. అనుమతి లేని కార్యక్రమాలకు అందరూ దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ నెల 20 వరకూ పశ్చిమ గోదావరి జిల్లాలో సెక్షన్‌ 143,30 అమల్లో ఉంటుందన్నారు. అలాగే పాలకోడేరు మండలం గరగపర్రులో శాంతయుత వాతావరణం కోసం కృషి చేస్తున్నామని డీజీపీ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement