నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా తిరుమలకు చేరుకున్నారు.
తిరుమలలో నేపాల్ ప్రధాని పర్యటన
Aug 26 2017 3:44 PM | Updated on Sep 12 2017 1:02 AM
తిరుమల: నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు ఈఓ అశోక్ సింఘాల్, జేఈఓ శ్రీనివాసరావు ఘనస్వాగతం పలికారు. ఆయన సతీసమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అంతకుముందు తిరుమల పర్యటనలో భాగంగా మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన తిరుమలకు వెళ్లారు.
Advertisement
Advertisement