వైభవంగా ముత్యాలమ్మ ప్రతిష్టా మహోత్సవం

వైభవంగా ముత్యాలమ్మ ప్రతిష్టా మహోత్సవం


తూర్పుగోదావరి (ముంగండ): ముంగండ మండలంలోని ముంగండ గ్రామంలో ముత్యాలమ్మ నూతన ఆలయ, విగ్రహ పునః ప్రతిష్టా మహోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవతా ప్రార్ధన, యాగశాల ప్రవేశంతో పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. గణపతి పూజ, పుణ్య వాహచనం, పంచగవ్యం, దీక్షా అగ్ని ప్రతిష్టాపన, హోమాలు, ధ్వజారోహణ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మశ్రీ పుల్లేటికుర్తి సత్యనారాయణశాస్త్రి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కార్యక్రమాల్లో గ్రామస్ధులతో పాటు పరిశర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అమ్మవారి ఆలయ పునర్మిణానికి గ్రామస్తులు, ఆడపడుచులు, దాతలు సహకారం అందించారు. మూడు రోజుల పాటు పూజా కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ కమిటీ నాయకులు విలేకరులకు తెలిపారు. చివరి రోజైన గురువారం అమ్మవారి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుందని వారు వివరించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top