breaking news
utsav
-
చాక్లెట్ ప్రేమికుల కోసం ‘ఉత్సవ టేబుల్’
అదేదో వ్యాపార ప్రకటనలో చెప్పినట్లు.. ‘తియ్యని వేడుక చేసుకుందామా’ అనే పదం ఎంత తియ్యగా అనిపిస్తుందో.. అదేరీతిలో.. సమయం సందర్భం ఏదైనా.. అది మొదలయ్యేది మాత్రం ‘తియ్యని వేడుక’తోనే.. ఇప్పుడీ సోదంతా ఎందుకంటే.. ప్రస్తుతం దీపావళి పండగ సమీపిస్తున్న నేపథ్యంలో స్వీట్స్కు ఉన్న ప్రాముఖ్యత వేరు. ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ తియ్యటి గిఫ్ట్ ప్యాకింగ్స్ ఎంచుకుంటారు.. ప్రతీ ఇంటా వెలుగులు చిమ్మే ఈ దీపావళి సీజన్లో మనం చేసుకునేది కేవలం ఉత్సవం కాదు.. ఓ ఆత్మీయ కలయిక. స్నేహాన్ని బలపరుచుకోవడం, ఆనందాన్ని పంచుకోవడం అనే భావనల సమ్మేళనం. దీపావళి నేపథ్యంలో నగరంలో స్వీట్లు, చాక్లెట్ల సందడి గురించి తెలిసిందే. అయితే ఈసారి పండుగకు పశ్చిమ గోదావరి జిల్లా కోకో తోటల నుంచి హైదరాబాద్ బంజారాహిల్స్ వరకూ సాగిన పంచదార రుచి కథలతో.. శ్రమ, కళ, ఫ్యాషన్ సమ్మిళిత చాక్లెట్ ఉత్సవాన్ని నగరవాసులకు పరిచయం చేస్తోంది మనం చాక్లెట్. ఈ సారి దీపావళి ఎడిషన్–2025లో భాగంగా మనం ‘ఉత్సవ టేబుల్’ అనే వినూత్న ఆలోచన చుట్టూ తన సృజనాత్మకతను విస్తరించింది. పంచుకోడానికి, రుచి చూడడానికి, ఆ అనుభూతిని పొందడానికి ఎన్నో మధుర క్షణాలను చాక్లెట్ రూపంలో అందించింది. పాశ్చాత్య శైలితో కాకుండా, భారతీయ భావనతో రూపొందిన ఈ కలెక్షన్లో ప్రతి డబ్బాలో గోదావరి కథలతో ఒక కొత్త అనుభవాన్ని పంచుతోంది. మనం చాక్లెట్ ఖార్ఖానా భారతదేశంలోని మొదటి చాక్లెట్ బ్రాండ్. ఈ ఖార్ఖానాలో ఆంధ్రప్రదేశ్లోని పశి్చమ గోదావరి జిల్లాలో పండించిన చక్కటి రుచి గల కోకో బీన్స్తో తయారు చేసిన చాక్లెట్తో తయారు చేయబడిన 300 కంటే ఎక్కువ ఉత్పత్తులు నగరంలోని విభిన్న రుచులను ఆస్వాదించే చాక్లెట్ ప్రియులను అలరిస్తున్నాయి. డిజిటల్ ఆర్టిస్ట్ నమ్రతా కుమార్ సృష్టించిన ప్రత్యేక డిజైన్లు ఈ ప్యాకేజింగ్కి కొత్త ఉత్సవ రూపాన్ని ఇస్తున్నాయి. ఆమె చిత్రాలలో కేవలం వేడుక కాదు, సమాజం, భాగస్వామ్యం, ఆనందం అనే విలువలు ప్రతిబింబిస్తున్నాయి. దీపావళి అనేది కేవలం వెలుగుల పండుగ కాదు, మనసులు దగ్గరయ్యే సందర్భం. ఆ భావనను మానం చాక్లెట్ తన ప్రత్యేక రుచులతో మరింత బలపరుస్తోంది. ఇండో–అమెరికన్ రుచులతో తయారు చేస్తున్న ఈ చాక్లెట్స్ ప్రత్యేకమైన వేగన్ స్టైల్లో తయారు చేశారు. ఈ చాక్లెట్స్ ఆరోగ్యకరమైన సమ్మేళనాలతో ఏ వయసు వారైనా ఇష్టంగా తీనగలిగే విధంగా రూపోందించారు. ఈ ఎడిషన్లో డార్క్చాక్లెట్–ఆరెంజ్ క్లస్టర్స్, గుంటూరు మిర్చి–డ్రింకింగ్ చాక్లెట్ మిక్స్, సీ సాల్ట్ స్ప్రింకిల్ థిన్స్, గోదావరి కోకో నిబ్స్ థిన్స్, నట్టీ ప్రాలిన్ బార్క్స్, పిస్తా ఫడ్జ్ ఇన్క్లూజన్ టాబ్లెట్, ఇండియన్ ఆరిజిన్ టాబ్లెట్ నెం.6 వంటి ప్రత్యేక ఉత్పత్తులు ఉన్నాయి. వేగన్ స్టైల్లో..(చదవండి: Man Name Makes Record: 'పేరు'తో ప్రపంచ రికార్డు..! ఏకంగా చట్టంలోనే మార్పులు చేసి..) -
దేశవ్యాప్తంగా కార్నివాల్స్పై కసరత్తు
గిన్నిస్ రికార్డులకెక్కిన తమ విజయవాడ ఉత్సవ్ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా కార్నివాల్స్ను నిర్వహించనున్నట్లు శ్రేయాస్ మీడియా వెల్లడించింది. దేశ, విదేశీ కళాకారులతో ఏపీలోని అరకు, గండికోట వంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఏడాది పొడవునా వేడుకలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సంస్థ ఫౌండర్ గండ్ర శ్రీనివాసరావు తెలిపారు.30 పైచిలుకు భారీ కాన్సర్ట్స్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మహా కుంభమేళా ప్రకటనల హక్కులను దక్కించుకుని, వేలాది బ్రాండ్స్ని కోట్ల మందికి చేరువ చేసినట్లు శ్రీనివాస్ చెప్పారు. తాజాగా సెపె్టంబర్లో 11 రోజుల పాటు సాగిన విజయవాడ ఉత్సవ్లో 15 లక్షల మంది పైగా పాల్గొనగా, స్థానికంగా రూ. 1,000 కోట్ల వ్యాపారం జరిగిందని అంచనాలున్నట్లు తెలిపారు. ఎక్స్పోలో 600 స్టాల్స్ ఏర్పాటు చేయగా, ప్రత్యక్షంగా, పరోక్షంగా 25,000 మందికి ఉపాధి లభించిందన్నారు. వచ్చే అయిదేళ్లలో విజయవాడ ఉత్సవ్తో రూ.5,000 కోట్ల వ్యాపార లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా తలపెట్టిన కార్నివాల్స్కు పలు బ్రాండ్స్ ముందుకొస్తున్నాయని తెలిపారు. -
RSS Utsav: మతం అడిగి కాల్చిచంపారు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
నాగ్పూర్: పహల్గామ్లో ఉగ్రదాడికి పాల్పడ్డ ముష్కరులు భారతీయులను మతం(ధర్మం) ఏమిటని అడిగి కాల్చిచంపారని, ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, అనంతరం దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన దరిమిలా ప్రభుత్వం, సైన్యం తీవ్రంగా ప్రతిస్పందించి ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పిందన్నారు.ఆర్ఎస్ఎస్ శతాబ్ది విజయదశమి వేడుకల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ నేడు, మన దేశంలో వైవిధ్యం విభజనలకు కారణమవుతోందని, అయినా మనమంతా ఒక్కటేనని, వైవిధ్యం అనేది ఆహారం, జీవన పరిస్థితులకే పరిమితమన్నారు. చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోవడం సరైనది కాదని, ఇలాంటి అరాచకత్వాన్ని ఆపాలన్నారు. విజయదశమి సందర్భంగా ఆయన హిందూ ఐక్యత గురించి మాట్లాడారు. వ్యవస్థీకృత హిందూ సమాజం భద్రతకు హామీనిస్తుందన్నారు. గత 100 ఏళ్లుగా హిందువులను ఏకం చేయడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కృషి చేస్తోందని అన్నారు.మహాకుంభ్తో ఐక్యతా తరంగాలుమహారాష్ట్రలోని నాగపూర్లో జరిగిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది విజయదశమి వేడుకలను ఉద్దేశించి మోహన్ భగవత్ ప్రసంగించారు. పహల్గామ్ దాడి, నక్సలైట్ల అంశాలను ఆయన ప్రస్తావించారు. పహల్గామ్ దాడి దరిమిలా సైన్యం పూర్తి సన్నద్ధతతో ప్రతిస్పందించిందని ఆయన అన్నారు. ప్రయాగ్రాజ్లో జరిగిన భారీ మహాకుంభ్ గురించి ప్రస్తావిస్తూ.. ఇది భారతదేశం అంతటా ఐక్యతా తరంగాలను విడుదల చేసిందన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఆర్ఎస్ఎస్లో కుల వివక్ష లేదు: రామ్ నాథ్ కోవింద్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘1991 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆర్ఎస్ఎస్, దాని స్వచ్ఛంద సేవకులను కలిసే అవకాశం లభించిందని, ఆర్ఎస్ఎస్ లో ఏ విధమైన కుల వివక్ష లేదన్నారు. 2001లో ఎర్రకోట సమీపంలో జరిగిన దళిత సంగం ర్యాలీలో కొంతమంది వాజపేయిని దళిత వ్యతిరేకిగా దుయ్యబట్టారని, అయితే అప్పుడు తాము అంబేద్కరిస్టులమని ఆయన సమాధానం చెప్పారన్నారు. తాను రాష్ట్రపతి పదవిని నిర్వర్తించేటప్పుడు, రాజ్యాంగ విలువలకు, బాబా సాహెబ్ ఆశయాలకు ప్రాధాన్యత ఇచ్చానన్నారు. ఈ ఏడాది ఆర్ఎస్ఎస్ తన 100వ వ్యవస్థాపక వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ప్రత్యేక తపాలా బిళ్ల, స్మారక నాణేన్ని విడుదల చేశారు.1925లో విజయదశమి వేళ..నాగపూర్ చేరుకున్న మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 1956లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించిన దీక్షా భూమిని సందర్శించారు. కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ 1925లో విజయదశమి నాడు 17 మంది సమక్షంలో ఆర్ఎస్ఎస్ను స్థాపించారు. 1926, ఏప్రిల్ 17న జరిగిన సమావేశంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అనే పేరును నిర్ణయించారు. ప్రస్తుతం జరుగుతున్న ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో 21 వేల స్వచ్ఛంద సేవకులు పాల్గొంటున్నారు.విదేశీ అతిథులు హాజరువిజయదశమి నాడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆయుధ పూజ నిర్వహించారు. కాగా ఘనా, ఇండోనేషియాకు చెందిన అతిథులు కూడా ఆర్ఎస్ఎస్ విజయదశమి వేడుకలలో పాల్గొంటున్నారు. దక్షిణ భారత కంపెనీ డెక్కన్ గ్రూప్కు చెందిన లెఫ్టినెంట్ జనరల్ రాణా ప్రతాప్ కాలిత్, కేవీ కార్తీక్,బజాజ్ గ్రూప్కు చెందిన సంజీవ్ బజాజ్ హాజరయ్యారు. ఘనా, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, థాయిలాండ్,యూకే, యుఎస్ఎలకు చెందిన ప్రతినిధులను ఆర్ఎస్ఎస్ ఈ వేడుకలకు ఆహ్వానించింది. -
అమెజాన్లో జీఎస్టీ బచత్ ఉత్సవ్
‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’లో భాగంగా అమెజాన్(Amazon) ‘గ్రేట్ సేవింగ్స్ సెలబ్రేషన్ జీఎస్టీ బచత్ ఉత్సవ్(GST Bachat Utsav)’కు శ్రీకారం చుట్టింది. ఈ ఉత్సవ్లో నెటిజన్లు 50 నుంచి 80 % డిస్కౌంట్తో ఆధునిక ఎల్రక్టానిక్స్ వస్తువులు, ఫ్యాషన్, బ్యూటీ, గృహోపకరణాలు, హెల్త్కేర్, నిత్యావసరాలను జీఎస్టీ తగ్గింపు ధరలతో కొనుగోలు చేయొచ్చు.లక్షకు పైగా ఉత్పత్తులు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ పే లేటర్ ద్వారా నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం ఉంది. ప్రైమ్ సభ్యులకు గరిష్టంగా 5% వరకు ఖచి్చతమైన క్యాష్బ్యాక్ లభించనుంది. ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10% డిస్కౌంట్, అమెజాన్ పే, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై అపరిమిత క్యాష్బాక్ పొందవచ్చు.ఇదీ చదవండి: చెప్పులు ధరించి డ్రైవింగ్ చేస్తే చలానా!? -
Hyderabad: భార్యతో గొడవపడి అర్ధరాత్రి పోర్షే కారులో చక్కర్లు..
బంజారాహిల్స్: భార్యతో గొడవపడి అర్ధరాత్రి ఖరీదైన పోర్షే కారులో చక్కర్లు కొడుతూ మితిమీరిన వేగంతో దూసుకెళ్ళి రోడ్డు ప్రమాదానికి కారకుడైన వ్యాపారి, స్టాండప్ కమేడీయన్ ఉత్సవ్ దీక్షిత్ను ఇప్పటికే బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేయగా ప్రమాదానికి కారణమైన పోర్షేకారు కండీషన్ తెలియజేయాల్సిందిగా జర్మనీ కంపెనీకి బంజారాహిల్స్ పోలీసులు లేఖ రాయనున్నారు. ఇప్పటికే లేఖను సిద్ధం చేసిన పోలీసులు నేడో, రేపో ఈ కారు కండీషన్ తెలియజేయాల్సిందిగా కోరనున్నారు. ఈ కారు మరమ్మతులకు వచ్చిందని మూడునెలల క్రితమే సర్వీస్ కు తేవాలని చెప్పామని రోడ్లపైకి తీసుకెళ్ళవద్దని హెచ్చరించడం కూడా జరిగిందని షోరూం ప్రతినిధులు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇదేదీ పట్టని ఉత్సవ్ దీక్షిత్ మూడునెలల నుంచి కారును నడిపిస్తూనే ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.వేగంతో కారును నడపడంతో మూల మలుపు వద్ద కారు స్టీరింగ్కు లాక్ పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు కూడా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారు కండీషన్లో ఉందా లేదా తేల్చాల్సిందిగా పోర్షే కంపెనీకి లేఖ రాయాలని నిర్ణయించారు. సంబంధిత కంపెనీ నుంచి నిపుణులు వచ్చి కారు కండీషన్పై నివేదిక ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించారు. ఉత్సవ్ దీక్షిత్ అరెస్టు -
సీఎం గారి భార్య కదా..
-
Mumbai: తప్పక చూడాల్సిన ఐదు అద్భుత గణపతులు
ముంబై: సెప్టెంబర్ 7 నుంచి దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. వినాయకుని జన్మదినోత్సవం సందర్భంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. మహారాష్ట్రలో 10 రోజుల పాటు గణేష్ ఉత్సవాలను భారీ స్థాయిలో నిర్వహిస్తుంటారు. ఈ సమయంలో గణపతి భారీ విగ్రహాలను వీధుల్లోని అద్భుత వేదికలలో ప్రతిష్టిస్తారు. ముంబైలో ఏర్పాటు చేసే ఐదు గణపతి విగ్రహాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. వాటిని చూసేందుకు వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు.లాల్బాగ్చా రాజాసెంట్రల్ ముంబైలోని లాల్బాగ్ మార్కెట్లోని లాల్బాగ్ పోలీస్ స్టేషన్ సమీపంలోని 'లాల్బాగ్చా రాజా' అత్యంత ప్రసిద్ది చెందిన వినాయక మండపంగా పేరొందింది. లాల్బాగ్లో ప్రతిష్టించిన గణపతి విగ్రహాన్ని నవసాచ గణపతి అంటారు. ఈ రూపంలోని గణేశుడు అన్ని కోరికలను తీరుస్తుంటాడని చెబుతారు. 10 రోజుల పాటు ఇక్కడ జరిగే గణేష్ ఉత్సవాల్లో ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దర్శనం కోసం క్యూ కడతారు.అంధేరీచా రాజాముంబయిలో గణేశోత్సవాలను చూసేందుకు వచ్చే భక్తులు తప్పనిసరిగా అంధేరీచా రాజాను సందర్శిస్తుంటారు. అంధేరీచా రాజాను 'నవసాల పవనార గణపతి' లేదా 'కోరికలను నెరవేర్చే గణేశుడు' అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం అంధేరీచా మండపం థీమ్ విభిన్నంగా ఉంటుంది. ఇది భక్తులను అమితంగా ఆకట్టుకుంటుంది.ముంబైచా రాజాముంబైలోని అత్యంత ప్రసిద్ధి చెందిన లాల్బాగ్చా రాజా గణేష్ మండపానికి కొద్ది దూరంలో మరొక ప్రసిద్ధ గణపతి మండపం ఉంది. గణేష్ గల్లీలో ఉన్న ఈ మండపంలో కొలువైన గణపతిని ముంబైచా రాజా అని పిలుస్తారు. ముంబైలోని పురాతన గణేష్ మండపాలలో ఒకటైన ముంబైచా రాజా 1928 నుండి పూజలందుకుంటున్నాడు. ఈ గణేష్ మండపం థీమ్ ప్రతి సంవత్సరం ఎంతో భిన్నంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ముంబై చా రాజాను సందర్శించి, ఆశీస్సులు పొందుతారు.జీఎస్బీ సేవా మండల్ముంబైలోని కింగ్స్ సర్కిల్లో ఉన్న జీఎస్బీ సేవా మండల్లోని గణపతి విగ్రహం దేశంలోనే అత్యంత సంపన్నమైనదిగా చెబుతారు. ఈ ఆకర్షణీయమైన విగ్రహాన్ని బంగారు, వెండి ఆభరణాలతో అలంకరిస్తారు. పంచధాతు (బంగారం, వెండి, రాగి, జింక్,తగరం) మిశ్రమంతో ఈ విగ్రహాన్ని రూపొందిస్తారు.ఖేత్వాడిచా గణరాజ్ప్రకాశవంతమైన లైట్లు, పూలతో అలంకరించిన ఖేత్వాడిచా గణరాజ్ మండపం దక్షిణ ముంబైలోని ఖేత్వాడి ప్రాంతంలో ఉంది. ఇది 40 అడుగులకుపైగా ఎత్తు కలిగివుంటుంది. 1959లో తొలిసారి ఇక్కడ గణపతిని నెలకొల్పారు. ఈ పూజా వేదిక ముంబైలోని ప్రముఖ గణపతి మండపాలలో ఒకటి. -
చిత్రకూట్ దీపావళి ప్రత్యేకత ఏమిటి? మందాకినీ తీరంలో ఏం జరుగుతుంది?
మధ్యప్రదేశ్ని చిత్రకూట్లో జరిగే దీపావళి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీపావళి పండుగ సందర్భంగా చిత్రకూట్లోని మందాకిని నది తీరంలో ఐదు రోజుల పాటు జరిగే జాతరలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుండి లక్షలాది మంది ప్రజలు తరలి వస్తారు. లంకను జయించిన శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వస్తూ, ఋషులతో కలిసి మందాకిని నదిలో దీప దానాన్ని చేశాడని స్థానికులు చెబుతారు. చిత్రకూట్లో దీపావళి పండుగను అయోధ్యలో జరిగే వేడుకల స్థాయిలో జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడ ధన్తేరస్ మొదలుకొని భాయ్ దూజ్ వరకు ఐదు రోజుల పండుగ జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చే లక్షలాది మంది భక్తులు మందాకినీ నదిలో దీప దానం చేస్తారు. అంటే నదికి దీపాలు సమర్పించి, తమకు శ్రేయస్సు అందించాలని నదీమతల్లిని కోరుకుంటారు. చిత్రకూట్లో పదకొండున్నర సంవత్సరాలపాటు వనవాసం చేసిన శ్రీరాముడు ఇప్పటికీ ఇక్కడ తిరుగాడుతూ, భక్తులకు కనిపిస్తాడని స్థానికులు చెబుతుంటారు. దీపావళి సందర్భంగా ఇక్కడ నిర్వహించే ఐదు రోజుల దీప దాన ఉత్సవం ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు ప్రతీయేటా 20 నుంచి 25 లక్షల మంది భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. ఇది కూడా చదవండి: డోంగర్ఘఢ్కు ప్రధాని మోదీ.. బమ్లేశ్వరి ఆలయంలో పూజలు -
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు: బంగారు తిరుచ్చి ఉత్సవం (ఫొటోలు)
-
జీఆర్టీ జ్యువెలర్స్ ‘సిల్వర్ ఉత్సవ్’
హైదరాబాద్: జీఆర్టీ జ్యువెలర్స్ వెండి వస్తువులు, వెండి ఆభరణాల అతిపెద్ద కలెక్షన్లతో ‘సిల్వర్ ఉత్సవ్’ను తీసుకొచి్చంది. పూజా సామగ్రి నుంచి డిన్నర్ సెట్ల వరకూ ప్రతి శ్రేణిలో డిజైన్లను అత్యంత స్వచ్ఛత, నాణ్యతతో తీర్చిదిద్దారు.వెండి వస్తువుల తరుగుపై 25%, వెండి ఆభరణాల మీద 10% తగ్గింపు పొందవచ్చు. ‘సిల్వర్ ఉత్సవ్ ద్వారా కస్టమర్లకు ప్రశాంతమైన, మంగళకరమైన అనుభవాన్ని అందించాలని భావిస్తున్నాము. తదనుగుణంగా ప్రతి డిజైన్ను రూపొందించాము’ అని జీఆర్టీ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ అనంత పద్మనాభన్ అన్నారు. -
Manchu Manoj: సాయి స్పోర్ట్స్ ఉత్సవ్ సక్సెస్ వేడుకలో మంచు మనోజ్ సందడి (ఫొటోలు)
-
బల్లారి ఉత్సవ్లో రూ.20 కోట్ల శునకం.. చూసేందుకు ఎగబడ్డ జనం..
బెంగళూరు: కర్ణాటకలో నిర్వహించిన బల్లారి ఉత్సవ్లో ఓ శునకాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. ఎందుకంటే ఇది మామాలు శునకం కాదు. దేశంలోనే అత్యంత ఖరీదైన అరుదైన జాతి కుక్క. దీని ధర రూ.20కోట్లు. కాకేసియన్ షెఫర్డ్ జాతికి చెందిన ఈ శునకం యజమాని బెంగళూరు వ్యాపారవేత్త సతీశ్. దీన్ని కొనేందుకు ఇటీవల కొందరు కళ్లు చెదిరే ధర ఆఫర్ చేసినా ఇతను తిరస్కరించాడు. ఈ శునకానికి కెడబామ్ హైదర్ అని పేరు పెట్టాడు సతీష్. దీని వయసు 14 నెలలు. నిలబడితే 6 అడుగుల ఎత్తు ఉంటుంది. బరువు దాదాపు 100 కిలోలు. దీన్ని పోషించేందుకు రోజుకు రూ.2,000 ఖర్చు చేస్తున్నాడు. బల్లారి ఉత్సవ్లో పాల్గొనేందుకు బెంగళూరు నుంచి దీన్ని ఏసీ కారులో తీసుకెళ్లాడు. ఖరీదైన జాతులు.. ఇదే కాదు సతీష్ వద్ద మరో రెండు అరుదైన శునకాల జాతులు కూడా ఉన్నాయి. రూ.కోటి ధర ఉన్న కొరియన్ డొసా మస్టిఫ్, అలాగే రూ.8 కోట్ల ధర పలికే అలస్కన్ మలమ్యూట్ బ్రీడ్ శుకనం కూడా ఉంది. తన వద్ద కాకేసియన్ షెఫర్డ్ జాతికి చెందిన రెండు కుక్కపిల్లలు కూడా ఉన్నాయని, ఒక్కోదానికి రూ.5 కోట్లు ఇచ్చి కొంటామని ఆపర్లు వస్తున్నాయని సతీష్ పేర్కొన్నాడు. బల్లారి ఉత్సవాలు జనవరి 21, 22 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగాయి. నిర్వాహకులు ఇక్కడ శునకాల పోటీలు నిర్వహించారు. 50 రకాల బ్రీడ్లు పోటీల్లో పాల్గొన్నాయి. సతీష్ను ప్రత్యేకంగా ఆహ్వానించడంతో ఆయన కాకేసియన్ షెఫర్డ్తో వచ్చి ఉత్సవాల్లో పాల్గొన్నాడు. దీంతో ఈ అరుదైన శునకాన్ని చూసేందుకు స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు. Meet Cadabom Hayder Royal dog Rs 20 crore🥰 pic.twitter.com/wQVKXB5bnD — Deepthy (@mani_deepthi) January 7, 2023 చదవండి: నెరవేరిన దశాబ్దాల కల.. ఆమె కమాండ్లో... -
విజయవాడలో నేడు, రేపు వాణిజ్య ఉత్సవం
-
ఉత్సవంతో వచ్చిన కరోనా: అటవీ గ్రామాల్లో కల్లోలం
ఆసిఫాబాద్: ఆరు ఊర్లను ఉప్పెనలా ముంచింది... గడపగడపకు రోగులు.. ప్రతి ఇల్లు ఒక క్వారంటైన్ మారింది.. కాటేసే రోగం దెబ్బకు నిద్రలేని రాత్రులు గడపుతున్నారు.. పల్లెలపై కరోనా పంజా విసిరింది. హోలీ సందర్భంగా నిర్వహించిన ఉత్సవం ఆ గ్రామాలను కరోనా కొంపముంచేసింది. ప్రస్తుతం ఆరు ఊర్లు కరోనాతో అల్లాడుతున్నాయి. ఒక్క ఉత్సవం ఆ అటవీ జిల్లాలో కరోనా ఉగ్రరూపం దాల్చేలా చేసింది. హోలీ సందర్భంగా గిరిజనులు లేంగి ఉత్సవాన్ని లింగపూర్ మండలంలోని మోతిపటార్లో ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవానికి దాదాపు ఐదు వేల మందికి పైగా గిరిజనులు హజరయ్యారు. మహారాష్ట్ర నుంచి కూడా వందల సంఖ్యలో గిరిజనులు తరలివచ్చారు. ఆ ఉత్సవాల్లో ఆడిపాడి సరదాగా గడిపారు. అయితే ఆ ఉత్సవంలోనే మహారాష్ట్ర నుంచి వచ్చిన వారి వలన కరోనా వ్యాపించింది. మహారాష్ట్ర వారితో సోకిన కరోనా ప్రస్తుతం ప్రతి ఊరికి పాకింది. కొత్తపల్లి గ్రామంలో 1,200 మంది ఉంటే వీరిలో 400 మంది కరోనా బారిన పడ్డారు. ఇంటికి ఒకరు కరోనాతో సతమతమవుతున్నారు. ఉత్సవంలో పాల్గొన్న మిగతా గ్రామాలు మోతిపటార్,లింగపూర్, మామిడిపల్లి, మరో రెండు గ్రామాల్లో ఇదే పరిస్థితి. పరీక్షలు నిర్వహిస్తున్నా కొద్ది కేసులు పెరుగుతున్నాయి. కరోనా విస్తరిస్తుండడంతో పల్లెవాసులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. కరోనా ఉగ్రరూపంపై అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ గ్రామాల్లో ప్రత్యేకంగా క్యాంపులు వేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా పాజిటివ్ తెలిన వారికి హోంక్వారంటైన్ చేస్తూ వైద్యం అందిస్తున్నారు. ప్రతి ఇల్లు హోంక్వారంటైన్ మారింది. ఒక మహిళ కరోనాతో ప్రాణాలు కోల్పోయింది కూడా. కరోనా ప్రస్తుతం ఇతర గ్రామాలకు విస్తరించకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. వైద్యాధికారులు మకాం వేసి రోగులు కోలుకోవడానికి వైద్యం అందిస్తున్నారు. ఉత్సవం జరిగి 22 రోజులు దాటిన తర్వాత కేసులు పెరుగుతున్నాయి. ఈ గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ అమలు చేస్తున్నారు. గ్రామాల సరిహద్దులు మూసివేశారు. ఇతర ప్రాంతాల వాళ్లు ఈ గ్రామాలకు రాకుండా.. ఇక్కడి నుంచి ఇతర గ్రామాలకు వెళ్లకుండా రాకపోకలు నిషేధం విధించారు. నిత్యావసర వస్తువులు గ్రామస్తులకు అందేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఆ ఉత్సవమే కరోనా విజృంభణకు కారణంగా తెలుస్తోంది. చదవండి: సంపూర్ణ లాక్డౌన్.. రేపటి నుంచి 1వరకు -
హద్దు మీరిన తెలుగు తమ్ముళ్ల ఆగడాలు
-
వైభవంగా ముత్యాలమ్మ ప్రతిష్టా మహోత్సవం
తూర్పుగోదావరి (ముంగండ): ముంగండ మండలంలోని ముంగండ గ్రామంలో ముత్యాలమ్మ నూతన ఆలయ, విగ్రహ పునః ప్రతిష్టా మహోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవతా ప్రార్ధన, యాగశాల ప్రవేశంతో పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. గణపతి పూజ, పుణ్య వాహచనం, పంచగవ్యం, దీక్షా అగ్ని ప్రతిష్టాపన, హోమాలు, ధ్వజారోహణ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మశ్రీ పుల్లేటికుర్తి సత్యనారాయణశాస్త్రి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కార్యక్రమాల్లో గ్రామస్ధులతో పాటు పరిశర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అమ్మవారి ఆలయ పునర్మిణానికి గ్రామస్తులు, ఆడపడుచులు, దాతలు సహకారం అందించారు. మూడు రోజుల పాటు పూజా కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ కమిటీ నాయకులు విలేకరులకు తెలిపారు. చివరి రోజైన గురువారం అమ్మవారి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుందని వారు వివరించారు.


