-
ఎన్డీయే ప్రభుత్వానికి రాహుల్ గాంధీ హెచ్చరిక..
సాక్షి, చెన్నై: ఎన్డీయే ప్రభుత్వం స్వతంత్ర వ్యవస్థలపై దాడి చేస్తోందని, ఆ ధోరణిని దేశం అనుమతించదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఒకరి సిద్ధాంతాలే(ఆరెస్సెస్ను ఉద్దేశించి) దేశాన్ని పాలించాలని బీజేపీ కోరుకుంటోందని ఆరోపించారు. ఆదివారం చెన్నైలో దివంగత డీఎంకే నాయకుడు కరుణానిధి నిలువెత్తు విగ్రహావిష్కరణ వేడుక జరిగింది. తేనాంపేటలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయం ఆవరణలో ప్రతిష్టించిన కరుణానిధి కంచు విగ్రహాన్ని యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ..మోదీ సర్కారు రాజ్యాంగబద్ధ సంస్థల స్వయంప్రతిపత్తి, దేశ సంస్కృతిని నాశనం చేస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అన్ని వర్గాలు, గొంతుకలు కలసి రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తారని ధీమా వ్యక్తం చేశారు. దివంగత నాయకుడు కరుణానిధి తమిళ ప్రజల గొంతుకగా నిలిచారని రాహుల్ ప్రశంసలు కురిపించారు. భావి ప్రధానిగా రాహుల్ పేరును ప్రతిపాదిస్తున్నట్లు ఈ సందర్భంగా స్టాలిన్ అనూహ్య ప్రకటన చేశారు. కేరళ,పుదుచ్చేరి, ఏపీ సీఎంలు పి.విజయన్, నారాయణస్వామి, చంద్రబాబు నాయుడు, సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం, సినీ నటుడు రజనీకాంత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భావి ప్రధాని రాహులే!: స్టాలిన్ దేశానికి ప్రధాని అయ్యే అన్ని అర్హతలు రాహుల్ గాంధీకి ఉన్నాయని, తమిళనాడు నుంచి ఆ పదవికి ఆయన పేరును దివంగత కరుణానిధి వారసుడిగా ప్రతిపాదిస్తున్నట్టు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ప్రకటించారు. జాతీయ స్థాయిలో తన తండ్రి కరుణానిధి పోషించిన పాత్రను గుర్తు చేశారు. 2004లో ఐల్యాండ్ గ్రౌండ్లో జరిగిన సభలో సోనియా గాంధీని ఉద్దేశించి తొలిసారిగా కరుణానిధి ప్రసంగించారన్నారు. ఇందిరావిన్ మరుమగలే వరుగ.. ఇండియావిన్ తిరుమగలే వెల్గ (ఇందిర కోడలా రావమ్మా.. భారత నారీ జయం నీకే) అని ఆహ్వానించారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆయన వారసుడిగా తమిళనాడు నుంచి ప్రధాని పదవికి రాహుల్ పేరును ప్రతిపాదిస్తున్నట్టు తెలిపారు. ‘రాహుల్ రావాలి.. దేశంలో సుపరిపాలన రావాలి’ అన్న నినాదంతో ప్రతిజ్ఞ చేశారు. అలాగే, మోదీ పాలనకు చరమ గీతం పాడేలా అందరం రాహుల్కు మద్దతుగా నిలుద్దామని పిలుపునిచ్చారు. విగ్రహావిష్కరణ అనంతరం మెరీనా తీరంలో అన్నాదురై, కరుణానిధి సమా«ధుల వద్ద సోనియా, రాహుల్ నివాళులర్పించారు. -
వైభవంగా ముత్యాలమ్మ ప్రతిష్టా మహోత్సవం
తూర్పుగోదావరి (ముంగండ): ముంగండ మండలంలోని ముంగండ గ్రామంలో ముత్యాలమ్మ నూతన ఆలయ, విగ్రహ పునః ప్రతిష్టా మహోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవతా ప్రార్ధన, యాగశాల ప్రవేశంతో పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. గణపతి పూజ, పుణ్య వాహచనం, పంచగవ్యం, దీక్షా అగ్ని ప్రతిష్టాపన, హోమాలు, ధ్వజారోహణ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మశ్రీ పుల్లేటికుర్తి సత్యనారాయణశాస్త్రి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కార్యక్రమాల్లో గ్రామస్ధులతో పాటు పరిశర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అమ్మవారి ఆలయ పునర్మిణానికి గ్రామస్తులు, ఆడపడుచులు, దాతలు సహకారం అందించారు. మూడు రోజుల పాటు పూజా కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ కమిటీ నాయకులు విలేకరులకు తెలిపారు. చివరి రోజైన గురువారం అమ్మవారి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుందని వారు వివరించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement