మైనార్టీలకు సర్కార్‌ అండ..

Muslim Joint Action Committee Meet MLA Anantha Venkatarami Reddy - Sakshi

ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి

సాక్షి, అనంతపురం: మైనార్టీలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి భరోసా ఇచ్చారు. ముస్లిం జాయింట్‌ యాక‌్షన్‌ కమిటీ నేతలు గురువారం ఆయనను కలిశారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌ఆర్‌పీలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని వినతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్‌ఆర్‌సీకి ప్రభుత్వం వ్యతిరేకమని, రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top