బాలికపై సామూహిక అత్యాచారం | Sakshi
Sakshi News home page

బాలికపై సామూహిక అత్యాచారం

Published Fri, Oct 16 2015 6:27 PM

Minor gang raped

మైదుకూరు : వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలం బస్వాపురం గ్రామం సమీపంలో ఓ బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం జరిపారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దునూరు గ్రామానికి చెందిన బాలికను బస్వాపురం గ్రామానికి చెందిన మల్లికార్జున (18), మల్లేశ్వర్‌రెడ్డి (20) బుధవారం రాత్రి తమ వెంట తీసుకెళ్లారు. బస్వాపురం గ్రామ చెరువు వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. దీనిపై బాధితురాలి తల్లిదండ్రులు శుక్రవారం సాయంత్రం మైదుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
Advertisement