కుటుంబకలహాలతో వ్యక్తి ఆత్మహత్య | man suicide in kurnool distirict | Sakshi
Sakshi News home page

కుటుంబకలహాలతో వ్యక్తి ఆత్మహత్య

Aug 21 2015 10:29 AM | Updated on Nov 6 2018 7:56 PM

కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

కర్నూలు: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు రూరల్ మండలం గార్గేయపురం గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన ఏసుదాసు(47) అనే వ్యక్తి ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ ఉంటాడు. కాగా, ఆర్థిక ఇబ్బందుల కారణంగా గత కొన్ని రోజులుగా భార్య రత్నమ్మతో కలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement